ప్రెసెంట్ టెక్నాలజీ పెరగడంతో ప్రతి పని ఇంట్లో ఉండే చేస్తున్నాము.మనం స్మార్ట్ ఫోన్స్ వచ్చాక సోషల్ మీడియా పైనే ఎక్కువుగా ఆధార పడుతూ ఉన్నాం.
ఈ రోజుల్లో సోషల్ మీడియా అంటే తెలియని వారు చాలా తక్కువ మంది ఉన్నారు.ఈ సోషల్ మీడియా మంచికి ఉపయోగించు కునే వారు ఎంతమంది ఉన్నారో.
దానిని నెగిటివ్ గా వాడుకునే వారు కూడా అంతే మంది ఉన్నారు.
ఇక ఈ మధ్య కాలంలో నెటిజెన్స్ సోషల్ మీడియా వేదికగా సెలెబ్రిటీలను ఒక ఆట ఆడు కుంటున్నారు.
ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళను టార్గెట్ చేస్తూ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు.సోషల్ మీడియా అయితే వాళ్ళు ఎవరో, ఏమిటో తెలియదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తూ మెంటల్ గా హెరాస్ చేస్తూ ఉంటారు.
మరీ హద్దు దాటితే అలంటి వాళ్ళు కష్టాలు అనుభవించాల్సిందే.
తాజాగా బీబీ బాస్ బ్యూటీ అరియనా ను ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేస్తూ ఎన్ని సార్లు బ్లాక్ చేసిన కూడా మళ్ళీ మళ్ళీ వేరే అకౌంట్ లతో ఇలానే చేస్తున్నాడట.
దీంతో బిగ్ బాస్ బ్యూటీ ఈ విషయం ఇంకా సహించలేక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.ఈ విషయం గురించి అరియనా సోషల్ మీడియా ద్వారా స్పందించింది.
తనను ఒక వ్యక్తి కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి పెడుతున్నాడట.ఎన్నిసార్లు బ్లాక్ చేసిన అలానే చేస్తుండడంతో అరియనా పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆ తర్వాత అతడి చేసినవన్నీ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెడుతూ.”నీకేంట్రా నొప్పి.ఎందుకంత పాగా, అసూయా.
రెడీగా ఉండు.నువ్వు ఎవరో తెలియాలి పగిలిపోద్ది” అంటూ అతడిపై ఫైర్ అయ్యింది.