పవన్ కళ్యాణ్ హీరోగా రానా కీలక పాత్రలో సాగర్ చంద్ర దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా భీమ్లా నాయక్.ఈ సినిమా చిత్రీకరన ముగింపు దశకు వచ్చింది.
సంక్రాంతికి సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది.సినిమా లో పవన్ కళ్యాణ్ పాత్ర మరియు రానా ల పాత్రలపై స్పష్టత ఇవ్వడం జరిగింది.
మలయాళ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా కు కథ మరియు స్క్రిప్ట్ తో పాటు మాటలను కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇవ్వడం జరిగింది.
మాటల మాంత్రికుడి హ్యాండ్ ఉండటం వల్ల భీమ్లా నాయక్ సినిమా స్థాయి రెట్టింపు అయ్యింది అనడంలో సందేహం లేదు.పెద్ద ఎత్తున అంచనాలున్న భీమ్లా నాయక్ సినిమా చిత్రీకరణ వచ్చే నెలలో పూర్తి అవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు.ఈ సమయంలో ఈ సినిమా ను అమెజాన్ ప్రైమ్ వారు ఏకంగా రూ.150 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
చిత్ర యూనిట్ సభ్యుల ను మేము సంప్రదించిన సమయంలో అవన్నీ కూడా పుకార్లే అంటూ తేల్చి చెప్పారు.ఒక ప్రాంతీయ భాష సినిమాకు అది కూడా ఒక డబ్బింగ్ సినిమాకు డైరెక్ట్ గా విడుదల చేసినా కూడా 150 కోట్ల రూపాయల బిజినెస్ అంటే మామూలు విషయం కాదు.
ఓటీటీ లో 150 కోట్ల రూపాయలకు గాను అమెజాన్ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది అంటే నమ్మశక్యంగా లేదు అంటూ మార్కెట్ వర్గాల వారు కూడా అంటున్నారు.
సినిమా చిత్రీకరణ దశలో ఉండగా ఇలాంటి వార్తలు రావడం చాలా కామన్ విషయం.అయినా ఇప్పటికే సినిమా థియేట్రికల్ రిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.మీడియాలో ఇలాంటి పుకార్లు మళ్లీ మళ్లీ పుట్టుకు వచ్చినా జనాలు నమ్మశక్యంగా లేవు.
స్టార్ హీరోల సినిమాలు ఇకపై డైరెక్ట్ ఓటీటీ ద్వారా విడుదల అవ్వడం చాలా అరుదుగా చూస్తాం.ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యాయి.
అలాగే ఓవర్సీస్ నుండి కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి.