బొమ్మరిల్లు వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన భాస్కర్ ఆ తర్వాత మళ్లీ సక్సెస్ దక్కించుకోలేక పోయాడు.ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం వల్ల కొత్త సినిమాకు చాలా గ్యాప్ వచ్చింది.
చాలా ఏళ్ల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా వచ్చింది.ఆ సినిమాను మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా 40 కోట్ల భారీ వసూళ్లను దక్కించుకుంది.
కరోనా సమయంలో ఇంతటి వసూళ్లు అంటే ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ అనడంలో సందేహం లేదు.అలాంటి సినిమాను దక్కించుకున్న బొమ్మరిల్లు భాస్కర్ తదుపరి సినిమా విషయంలో ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వడానికి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తదుపరి సినిమాను నిర్మించేందుకు అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చేశాడు.కథలు సిద్దం చేయి మంచి హీరోతో సినిమాను చేద్దాం అంటూ అల్లు అరవింద్ ఇప్పటికే హామీ ఇచ్చాడట.
ప్రస్తుతం సుకుమార్ రెడీ చేస్తున్న కథ అల్లు శిరీష్ కోసం అంటూ వార్తలు వస్తున్నాయి.గతంలో అల్లు అర్జున్ తో సినిమాను తీసిన బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు అల్లు శిరీష్ తో సినిమాను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.
అది కాకుండా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో కూడా ఒక సినిమాను చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట.మొత్తానికి వీరిద్దరిలో ఒకరితో బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.
ఆవిషయంలో ఒక స్పష్టత రావడంకు మరి కొన్నాళ్ల సమయం అయితే పట్టవచ్చు.హీరోల విషయం ఏమో కాని బొమ్మరిల్లు భాస్కర్ తదుపరి సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అనేది కన్ఫర్మ్.
తదుపరి సినిమా వచ్చే ఏడాదిలో పట్టాలెక్కనుందేమో చూడాలి.