గతంలో కొన్ని తెలుగు సినిమాలలో పలు క్యారెక్టర్ లో నటించిన హీరో శ్రీరామ్ కొద్ది కాలం నుంచి పూర్తిగా తెలుగు తెరకు దూరమయ్యారు.ఈ క్రమంలోనే శ్రీ రామ్ హీరోగా సంచిత పదుకొనే హీరోయిన్ గా ఎన్ వీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “అసలేం జరిగింది“.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదల కావడంతో ఈ సినిమా గురించి హీరో శ్రీరామ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమా కథను దర్శకుడు రాఘవ (ఎన్వీఆర్) చెప్పేటప్పుడు కథ వింటూ, కథ ప్రేమలో పడిపోయానని, కథ వినేటప్పుడు ఇది ఎంతో అద్భుతమైన ప్రాజెక్ట్ అని ఇందులో తప్పకుండా నటించాలని భావించినట్లు శ్రీరామ్ తెలిపారు.
ఒకప్పుడు సినిమాలకు డబ్బింగ్ చెప్పే సమయంలో అలా కాదు ఇలా చెప్పాలని చాలా మంది చెప్పేవారు.అయితే ఈ సినిమా మొత్తం గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కడంతో డబ్బింగ్ చెప్పడం కూడా ఎంతో సులువుగా ఉందని తెలియజేశారు.
ఈ సినిమా గ్రామీణ ప్రాంతాలలో తెరకెక్కడంతో పలు సన్నివేశాలు కేవలం ఓకే టేక్ లోనే ఓకే అవడంతో అందరూ ఎంతో ఆశ్చర్యపోయారని ఈ సందర్భంగా శ్రీరామ్ తెలిపారు.ఈ క్రమంలోనే మరి కొన్ని తెలుగు చిత్రాలలో నటించాలని కోరినట్లు శ్రీరామ్ తెలిపారు.
తనకు అవకాశం వస్తే తెలుగు సినిమాలలో తప్పకుండా నటిస్తానని ఇలాంటి మంచి కథను తనను నమ్మి తనకు ఈ సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చినందుకు నిర్మాత జాన్సన్ కు శ్రీరామ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.