వైసీపీ పార్టీ కీలక నేత ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళితే తెలుగుదేశం పార్టీ గుర్తు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి.సీఎం జగన్ ని ఉద్దేశించి దారుణంగా దుర్భాషలాడటం తెలిసిందే.ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయి.దీంతో చంద్రబాబు ప్రస్తుతం నిరసన దీక్ష చేపడుతుండగా మరికొద్దిరోజుల్లో ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి.
తాజా పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
చంద్రబాబు వెళ్తే మేము కూడా ఢిల్లీ వెళ్తామని తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
బూతులు తిట్టడానికి నిరసన దీక్ష చేపడుతున్నారని మండిపడ్డారు.టీడీపీ లైన్ దాటింది ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబుదే అని పేర్కొన్నారు.
సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అని స్పష్టం చేశారు.
దాడి చేయడం తప్పే… కానీ ఆ రీతిలో ఆగ్రహం రావడానికి కారణం ఎవరు అని ప్రశ్నించారు.జగన్ ఆపుతున్నారు కనుక కార్యకర్తలు సహనంగా ఉన్నారని పేర్కొన్నారు.ఏదిఏమైనా చంద్రబాబు ఢిల్లీ వెళ్తే మేము కూడా వెళ్తాము…టీడీపీ నీ నిషేధించాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.