ఒక్కోసారి కొంతమంది హీరోహీరోయిన్లకి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమా అవకాశాలు బాగానే వరించినప్పటికీ తాము తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా చేజేతులారా సినీ కెరీర్ ని పోగొట్టుకున్న నటీనటులు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలామంది ఉన్నారు.అయితే ఇందులో 2000 వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు “వీరు.కే” దర్శకత్వం వహించిన “అంతా మన మంచికే” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ “ఫ్లోరా సైని” కూడా ఈ కోవకే చెందుతుంది.కాగా ఈ అమ్మడు వచ్చి రావడంతోనే తన నటనా ప్రతిభను నిరూపించుకోవడంతో తెలుగు ప్రముఖ సినీ దర్శక నిర్మాతల కళ్ళల్లో పడింది.
దీంతో కొంతకాలం పాటు హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూ బిజీబిజీగా రాణించింది.కానీ ఆ తరువాత బాలీవుడ్ సినిమా పరిశ్రమపై ఉన్నటువంటి మక్కువ కారణంగా మూటాముల్లె సర్దుకుని ముంబై కి వెళ్లిపోయింది.
ఇక అప్పటి నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ అమ్మడి జాడ పెద్దగా కనిపించలేదు.
అయితే ఈ మధ్య కాలంలో ఫ్లోరా సైని కి సినిమా అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి.
దాంతో అప్పుడప్పుడు పలు బోల్డ్ వెబ్ సిరీస్, స్పెషల్ సాంగ్స్ వంటివాటిలో నటిస్తూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.ఇటీవల కాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటోంది.
అయితే తాజాగా ఫ్లోరా సైని బాత్ రూమ్ లో ఒంటి పై టవల్ చుట్టుకుని ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.అంతటితో ఆగకుండా ఈ ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది.
దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోత కి నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు.దాంతో ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే పెద్ద సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి.
మరికొందరు మాత్రం ఈ ఫోటోలో పై స్పందిస్తూ ఈ మధ్య కాలంలో నటి ఫ్లోరా సైనికి సినిమా అవకాశాలు బాగా కరువయ్యాయని దాంతో అందాల ఆరబోతతో అవకాశాలను ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందంటూ బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయంలో ఇలా ఉండగా ఈ అమ్మడు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 50కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.కాగా ఈ అమ్మడు చివరిగా తెలుగులో “12ఓ క్లాక్” అనే హిందీ అనువాద చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కనిపించింది.కానీ ఈ చిత్రం విడుదలైనట్లు కూడా చాలా మందికి తెలియదు.
కాగా ప్రస్తుతం ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు తెరకెక్కిస్తున్న బోల్డ్ వెబ్ సిరీస్ లో ఘాటుగా అందాలు ఆరబోసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.