తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఆసక్తికరంగా సాగుతోంది.ఈ సమయంలో ప్రియా మరియు సన్నీల మద్య జరుగుతున్న విషయం నెట్టింట వైరల్ అవుతోంది.
చెంప పగులుద్ది.ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ప్రియా చేస్తున్న వ్యాఖ్యలు సన్నీని రెచ్చ గొట్టే విధంగా ఉన్నాయి.
ఒక మగాడిని అంతగా రెచ్చగొట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు.ఆ విషయం అందరికి అర్థం అవుతున్నా కూడా ప్రియా మాత్రం కావాలని రెచ్చగొట్టి అతడు తప్పు చేయాలని భావిస్తుంది.
టాస్క్ ల్లో ఏమీ ఎఫర్ట్ పెట్టకుండా.పెద్దగా ఆడకుండా బిగ్ బాస్ లో ప్రియా వ్యవహరిస్తున్న తీరు మాత్రం చాలా మంది విమర్శించే విధంగా ఉంది.
బిగ్ బాస్ సీజన్ 5 లో ఉండే అర్హత అస్సలు ప్రియాకు లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఆమె తీరును వ్యతిరేకిస్తున్నారు.మొత్తానికి బిగ్ బాస్ లో నాగార్జున యొక్క అసలైన జడ్జ్ మెంట్ కు పరీక్ష ఎదురు కాబోతుంది.
హోస్ట్ గా నాగార్జున ఇప్పటి వరకు సాదా సీదాగానే వ్యవహరిస్తూ వచ్చాడు.ప్రియా చేసిన వ్యాఖ్యలను ఖండించకుంటే మాత్రం ఆయన టార్గెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి నాగార్జున ఈ విషయంలో తీసుకునే నిర్ణయం.వ్యవహరించే తీరు చాలా కీలకంగా మారింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బుల్లి తెర అభిమానులు.బిగ్ బాస్ ను రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వారు నాగార్జున శనివారం ఎపిసోడ్ లో ఎలా వ్యవహరించబోతున్నాడు అనే విషయమై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే నాగార్జున చాలా వరకు కొందరి తప్పులను వదిలేస్తూ వచ్చాడు.ఇంకా కూడా ఈ విషయంలో ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం పర్యావసనాలు సీరియస్ గా ఉంటాయని అంటున్నారు.