టాలీవుడ్ లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు కోట శ్రీనివాస రావు.ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించిన ఆయన టాలీవుడ్ లో ఎంతో గౌరవంను మూట కట్టుకున్నాడు.
స్టార్స్ సూపర్ స్టార్స్ తో కలిసి నటించిన కోటా శ్రీనివాస రావు వయసు మీద పడింది.ఆయన చేసిన అద్బుతమైన పాత్రలు ఇప్పటికి ఆయన్ను గొప్ప వ్యక్తిగా నటుడిగా మన ముందు ఉంచుతున్నాయి.
ఆయన గురించి చాలా మందికి పాజిటివ్ ఒపీనియర్ ఉంది.అలాంటి పాజిటివ్ ఒపీనియర్ ఉన్న ఈ సమయంలో కోట శ్రీనివాస రావు తనను తాను బ్యాడ్ చేసుకునేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇండస్ట్రీలో కొన్ని విషయాలు నిజాలు అయినా కూడా వాటిని మాట్లడకూడదు.ఎందుకంటే వాటి వల్ల ఇతరులతో కంఠు అవ్వాల్సి వస్తుంది.
అంటే ఇండస్ట్రీలో అందరితో సన్నిహితంగా ఉన్నప్పుడు మాత్రమే అందరిలో మంచి పేరు వస్తుంది.ఏదైనా తప్పు ఉంటే మౌనంగా ఉండటం బెటర్ అనేది ప్రతి ఒక్కరు పాటించే ఒక రూల్.
కోట శ్రీనివాసరావు చాలా కాలంగా ఇదే రూల్ ను ఫాలో అయ్యాడు కనుక ఇండస్ట్రీలో కొన్ని వందల సినిమాలను ఆయన చేయగలిగాడు.కాని ఇప్పుడు మాత్రం ఆయన సినిమాలు చేయడం లేదు కదా అని ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నాడు.ఎప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు తెరపైకి తీసుకు వస్తున్నాడు.బాలకృష్ణ మొహంపై ఉమ్ము వేయడం. ఎన్టీఆర్ పూర్ణ కుంభం దొంగిలించడం వంటి విషయాలను ఇప్పుడు ఆయన మాట్లాడటం కొందరికి ఆగ్రహం తెప్పిస్తుంది.ఇటీవల అనసూయ డ్రస్సింగ్ గురించి.
అలాగే మా ఎన్నికల గురించి రకరకాలుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.దాంతో చాలా మంది ముసలి వాళ్లు అయితే చాదస్తం పెరగుతుంది.
ఇప్పుడు కోటకు ఆ చాదస్తం ఎక్కువ అయినట్లుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.