బిగ్ బాస్ సీజన్ 5లో సిరి, షణ్ముఖ్ ల జోడీ ఏ ఆట అయినా కలిసి ఆడుతున్నారన్న విషయం తెలిసిందే.వీరితో పాటుగా జశ్వంత్ కూడా కలిసి ముగ్గురు త్రిమూర్తులుగా హౌజ్ మెట్స్ తో పిలవబడుతున్నారు.
మాట్లాడితే ఈ ముగ్గురు కలిసి మోజ్ రూం లో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు.అయితే హౌజ్ లో మొదటి నుండి షణ్ముఖ్, సిరిల హంగామా తెలిసిందే.
షణ్ముఖ్ కి బయట ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ చూసో.లేక తనకు బయట తెలుసనో కాని షణ్ముఖ్ వెంటే సిరి అన్నట్టు ఆట ఆడుతుంది.
అంతేకాదు అతని మాటే తన మాట అనేలా చేస్తుంది.అతను ఏం చెప్పినా అదే రైట్ అన్నట్టు చేస్తుంది.
అయితే అడపాదడపా వీరి మధ్య గొడవలు వస్తున్నాయి.అయినా సరే సిరి సర్ధుకుపోయి కలుస్తుంది.
కాని మంగళవారం ఎపిసోడ్ లో సిరి తన టీం మెట్స్ ఇద్దరిని వదిలి సోలోగా గేం ఆడినట్టు అనిపిస్తుంది.ప్రభావతి ఎగ్స్ టాస్క్ లో ఎప్పటిలానే షణ్ముఖ్, జశ్వంత్ సైలెంట్ గా ఉండగా సిరి సోలోగా ఆడుతుంది.
అయితే తన స్టిక్కర్స్ ఎవరో కొట్టేశారన్న అనుమానంతో అందరి బెడ్లను చెక్ చేసింది.ఆ టైం లో షణ్ముఖ్ బెడ్ కూడా చెక్ చేసిందని అతను అనుకుంటాడు.
కాని సిరి అలా చేయలేదు.దీనిపై వారిద్దరికి బాగానే చెడింది.
ఇక ఈరోజు టాస్క్ లో కూడా జశ్వంత్, సిరిలకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు.ఆటలో తనని ఎవరు రికగ్నైజ్ చేయట్లేదని షణ్ముఖ్ ఫీల్ అయ్యాడు.
సో ఈ గొడవతో సిరి, షణ్ముఖ్ ల మధ్య పూర్తిగా ఖటీఫ్ అయినట్టే అని చెప్పొచ్చు.