బిగ్ బాస్ సీజన్ 5లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ గా హౌజ్ లోకి వెళ్లాడు షణ్ముఖ్ జశ్వంత్.వెబ్ సీరీస్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వచ్చిన క్రేజ్ తో సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్న షణ్ముఖ్ బిగ్ బాస్ కు వెళ్లడం అందరిని సర్ ప్రైజ్ చేసింది.
తనని బిగ్ బాస్ కు ఒప్పించేందుకు బిగ్ బాస్ టీం భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్టు టాక్.ఇదిలాఉంటే మొదట్లో గేమ్ ఆడుతున్నట్టు అనిపించిన షణ్ముఖ్ ఈమధ్య అసలు తన ఆట సరిగా ఆడకపోగా ఇతరుల ఆటని వేలెత్తి చూపిస్తున్నాడు.
కేవలం ఆ మోజ్ రూం లో సిరి, జెస్సిలతో మీటింగ్స్ పెట్టడం తప్ప షణ్ముఖ్ బిగ్ బాస్ హౌజ్ లో పెద్దగా ఏమి చేయట్లేదు అన్నది కొందరి టాక్.అయితే లాస్ట్ సీజన్ లో అభిజిత్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టు అనిపించినా అతను వేరే వాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోలేదు.
కాని షణ్ముఖ్ మాత్రం తను ఆడకపోగా వేరే వాళ్ల ఆటని జడ్జ్ చేస్తున్నాడు.అది బయటకు ఎలా వెళ్తుంది అన్నది అతను ఆలోచించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది.అయినా సరే సోషల్ మీడియాలో షన్ను ఫ్యాన్స్ మాత్రం అతన్ని గెలిపించాలని ప్రయత్నిస్తున్నారు.తన గేమ్ ప్లాన్ మార్చకోకుండా ఇలానే కొనసాగితే మాత్రం షణ్ముఖ్ కూడా డేంజర్ జోన్ లో పడే అవకాశం ఉందని చెప్పొచ్చు.
.