యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్.ఈ సినిమా కరోనా కారణంగా అనుకున్న సమయానికి రాలేక పోయింది.
ఇక అప్పటి నుండి వాయిదా పడుతూనే వస్తుంది.ఇక ఈ మధ్యనే రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇంకా చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే బాలన్స్ ఉందని సమాచారం.
ఈ సినిమా 1975 బ్యాక్ డ్రాప్ లో యూరప్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామా.
ఈ సినిమాలోని లవ్ స్టోరీ ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ఎప్పటి నుండో చెబుతున్న మాట.ఒక వైపు అందమైన ప్రేమ కథతో పాటు మరొక వైపు భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయట.ఈ సినిమా మెజారిటీ షూట్ యూరప్ లోనే తెరకెక్కించారు.ఇక ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం భారీ ఖర్చు చేశారట.
యువీ క్రియేషన్స్ ఈ సినిమా బడ్జెట్ కు ఏ మాత్రం రాజీ పడకుండా డైరెక్టర్ కు కావలసిన నిధులను పెట్టింది.
ఇక తాజాగా ఈ సినిమా గురించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ సినిమా క్లైమాక్స్ కోసమే ఏకంగా 50 కోట్లు ఖర్చు చేశారట.15 నిముషాలు ఉండే ఈ సినిమా క్లైమాక్స్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎంత మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాల్సిందే.ఇక ప్రభాస్ ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు.ఇక ఈ రెండు సినిమాలు సెట్స్ మీదనే ఉన్నాయి.