ప్రస్తుత కాలంలో ఎంతో మంది కుర్రాళ్ళు ఏదో ఒక మూలన దరువు స్టెప్పులు వేస్తూ తమదైన శైలిలో ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు.ఇలా తీన్మార్ స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతారు.
ఇలా గత కొద్ది రోజుల క్రితం బుల్లెట్ బండి ద్వారా ఒక పెళ్లి కూతురు చేసిన డాన్స్ వైరల్ కావడంతో ఏకంగా ఆమెకు పలు అవకాశాలు కూడా వచ్చాయి.ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం అయ్యో వద్దమ్మా అంటూ సుఖీభవ అంటూ తీన్మార్ స్టెప్పులు వేసిన శరత్ కుమార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రెడ్ లేబుల్ టీ పొడికి సంబంధించిన ఒక యాడ్ కు స్పూఫ్ చేస్తూ తీన్మార్ స్టెప్పులు వేశాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సుఖీభవ కుర్రాడు శరత్ రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయారు.
ఈ క్రమంలోనే ఇతనికి ఏకంగా మూడు సినిమాలలోనూ, ఒక యాడ్ లో నటించే అవకాశం వచ్చింది.ఇలా అయ్యో వద్దమ్మ సుఖీభవ అంటూ చేసిన శరత్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే ఈ కుర్రాడి పై కొంతమంది హిజ్రాలు దాడి చేసి తనని చావ బాధారని వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై స్పందించిన శరత్ తనని కొట్టింది నిజమే కానీ తనపై దాడి చేసింది హిజ్రాలు కాదని, కొన్ని పాత గొడవల కారణంగా తనపై కొందరు దాడి చేశారని శరత్ తెలిపారు.గతంలో తన ఫ్రెండు చెల్లెలను ఎవరో ఏడిపిస్తే వారిని కొట్టడంతో జైలుకు కూడా వెళ్ళి వచ్చానని, ఆ పాత కక్షలు మనసులో పెట్టుకుని ప్రస్తుతం తనను కొట్టారని తెలిపాడు.తనకు సినిమాలలో అవకాశాలు రావడంతో అది చూసి వారు ఓర్చుకోలేక తనపై దాడి చేశారని ఆ సమయంలో పోలీసులు రాకపోతే తనిని చంపేసేవారు అంటూ సుఖీభవ శరత్ తన పై జరిగిన దాడి గురించి తెలిపారు.