కదులుతున్న రైలు నుంచి నిండు గర్భిణి దిగేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో, వెంటనే అక్కడ ఉన్న రైల్వే కానిస్టేబుల్ తన ప్రాణాలకు తెగించి గర్భిణీ ని కాపాడే ప్రయత్నం చేశాడు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముంబై లోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ లో రైలు ప్రయాణం చేస్తూ ఓ నిండు గర్భిణీ కదులుతున్న రైలు నుండి దిగే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయింది.పక్కనే ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ దీనిని గమనించి వెంటనే అప్రమత్తమయ్యాడు.
తక్షణమే ఆమె చేయి పట్టుకుని ప్లాట్ఫామ్ పైకి లాగి ఆమె ప్రాణాలను కాపాడాడు.ఆ సమయంలో కానిస్టేబుల్ అక్కడ లేకపోతే ఆ గర్భిణీ రైలు పట్టాలకు, ప్లాట్ఫాం మధ్యలో పడిపోయి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండేది.
ఆ గర్భిణీ వెంట ఉన్న ఓ వ్యక్తి కూడా ఆమెను కాపాడబోయి రైల్లో నుంచి కిందకు దూకాడు.ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు తన ప్రాణాలకు తెగించి గర్భిణీనీ కాపాడిన కానిస్టేబుల్ ను ప్రశంసిస్తున్నారు.
ఒకవేళ ఆ సమయంలో పోలీస్ కానిస్టేబుల్ అక్కడ లేకపోతే ఆ గర్భిణీ పరిస్థితి ఏంటి అని, ఆలోచిస్తేనే గుండె తరుక్కుపోతుంది అని, అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని , వారి వెంట వచ్చిన వారు కూడా గర్భిణీలను జాగ్రత్తగా చూసుకోవాలని కొంతమంది అంటున్నారు.రైలు కదిలేటప్పుడు దిగడం, ఎక్కడం లాంటివి చేయకూడదని మరి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనా గర్భిణీలు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.