బుల్లితెరపై ఎన్టీఆర్ హోస్ట్ గా చేశారంటే ప్రేక్షకులకు నచ్చే విధంగా ఆ షో ఉంటుందనే సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ఆగష్టు నెల నుంచి బుల్లితెరపై ప్రసారమవుతూ ప్రేక్షకులకు వినోదం, విజ్ఞానం అందిస్తున్న సంగతి తెలిసిందే.
బుల్లితెరపై మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటున్న షోలలో ఎవరు మీలో కోటీశ్వరులు సైతం ఒకటని చెప్పవచ్చు.
నిన్నటి ఎపిసోడ్ లో ఈ షోకు రాజమండ్రికి చెందిన సురేంద్రనాథ్ అనే వ్యక్తి కంటెంస్టెంట్ గా హాజరయ్యారు.
ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న సురేంద్ర నాథ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు.ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు వేగంగా సమాధానాలు చెప్పిన సురేంద్రనాథ్ 40,000 రూపాయల ప్రశ్న కోసం తొలి లైఫ్ లైన్ ను వినియోగించుకున్నారు.6,40,000 రూపాయల ప్రశ్నకు సురేంద్రనాథ్ రెండో లైఫ్ లైన్ ను వినియోగించుకున్నాడు.
అక్కను అడిగి ఆ ప్రశ్నకు సురేంద్రనాథ్ సమాధానం ఇచ్చారు.అయితే ఆడియన్స్ మధ్య కూర్చున్న సురేంద్రనాథ్ కూతురు తనకు సమాధానం తెలుసని చెప్పగాఎంబీఏ ఫైనాన్స్ చదివారు ఆ ప్రశ్నకు కూడా సమాధానం తెలియదా సిగ్గుండాలి అంటూ ఎన్టీఆర్ సరదాగా అన్నారు.తారక్ అలా అనడంతో కంటెస్టెంట్ కూడా నవ్వారు.
ఆ తర్వాత శంఖం మోగడంతో ఈరోజు సురేంద్రనాథ్ గేమ్ ను ఆడనున్నారు.
ఈ షోలో సురేంద్ర నాథ్ ఎంత గెలుచుకుంటారో చూడాల్సి ఉంది.కంటెస్టెంట్లతో కలిసిపోతూ ఎన్టీఆర్ ఈ షోను అద్భుతంగా హోస్ట్ చేస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఎన్టీఆర్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎక్కువ మొత్తం గెలవడానికి తన వంతు సహకారం అందిస్తున్నారు.
అయితే ఈ షో తర్వాత సీజన్ కు మాత్రం తారక్ హోస్ట్ గా ఉండరని సమాచారం.