డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా అనిల్ పాడూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రొమాంటిక్ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుంది కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదల కాలేక పోయింది.ఇక ఎట్టకేలకు వచ్చే వారం అక్టోబర్ 29న థియేటర్స్ లోకి తీసుకు రాబోతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా చేస్తుంది చిత్ర యూనిట్.
ఈ క్రమంలోనే నిన్న ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల అయ్యింది.
ఈ ట్రైలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల అయినా సంగతి తెలిసిందే.ఈ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమా ట్రైలర్ ఫుల్ రొమాంటిక్ గా ఉంది.ఈ ట్రైలర్ విడుదల చేసిన తర్వాత పూరీ జగన్నాథ్ ప్రభాస్ గురించి మాట్లాడారు.
రొమాంటిక్ సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తున్నామని తెలిసిన తర్వాత ప్రభాస్ ఈ సినిమా గురించి ఫోన్ చేసి అడిగారట.నేను ప్రభాస్ ను ట్రైలర్ లాంచ్ కోసం పిలవాలి అనుకోలేదు కానీ ప్రభాస్ ఫోన్ చేసి రొమాంటిక్ సినిమా గురించి ట్వీట్ చెయ్యాలా? ఏదైనా ఈవెంట్ కు రావాలా? చెప్పు డార్లింగ్ అని అడిగారట ఆయన అంత మంచి వారు అని పూరీ ప్రభాస్ ను ప్రశంసించారు.
నేను ఎప్పుడు గతంలో ప్రభాస్ తో సినిమాలు చేశా.కానీ ప్రభాస్ ఇప్పుడు నా కొడుకు కోసం తానే స్వయంగా వస్తాను అని అన్నారు.అంత మంచి వారు ప్రభాస్ అని పూరీ తెలిపాడు.ఇక ఈ సినిమా గురించి ప్రభాస్ మాట్లాడుతూ.ఆకాష్ చాలా అనుభవం ఉన్న హీరోలా చేసాడు.ఈ సినిమా ట్రైలర్ చాలా రొమాంటిక్ గా ఉంది.
ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాదిస్తుందని డార్లింగ్ తెలిపారు.