1.ఎన్.ఆర్.ఐ వడ్లమాని కి సన్మానం
చార్లెట్, నార్త్ కరోలినా , అమెరికా కు చెందిన మానవతా వాది , గాయకులు శ్రీనివాస్ వడ్లమనిని వంశీ ఆర్ట్స్ థియేటర్స్ హైదరాబాద్ వారు ఘనంగా సత్కరించారు.
2.26 న కోవాక్సిన్ పై డబ్ల్యూహెచ్ వో నిర్ణయం
భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకా కు అత్యవసర వినియోగ అనుమతులపై డబ్ల్యూహెచ్వో ఈ నెల 26 న కీలక నిర్ణయం తీసుకోనుంది.
3.దుబాయ్ పారిపోయిన ఆఫ్ఘన్ మంత్రి
తాలిబన్ సీనియర్ నేత విదేశీ వ్యవహారాల శాఖ డిప్యూటీ మినిస్టర్ షేర్ మహమ్మద్ అబ్బాస్ కాబూల్ నుంచి దుబాయ్ పారిపోయారు.పాకిస్తానీ గూడచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ ) తనను హత్య చేస్తుందనే భయం తో ఆఫ్ఘన్ నుండి పారిపోయినట్లు సమాచారం.
4.భారత జలాంతర్గామిని అడ్డుకున్నాం : పాక్
భారత్ కు చెందిన జలాంతర్గామిని అడ్డుకున్నట్లు పాకిస్థాన్ తెలిపింది.
5.జర్మనీలో దసరా, బతుకమ్మ వేడుకలు
సమైక్య తెలుగు వేదిక స్టూట్కర్గ్ జర్మనీ ఆధ్వర్యంలో అక్టోబర్ లో బతుకమ్మ , దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు.
6.ఆర్కిటిక్ మంచు పలకలో భారీ గొయ్యి
ఆర్కిటిక్ లోని పురాతన మంచు పలకలో భారీ గొయ్యి ఏర్పడింది.ఈ గొయ్యి దాదాపు 100 కిలో మీటర్ల మేర విస్తరించింది.
7.పిల్లలు తప్పు చేస్తే తల్లి తండ్రులకు శిక్ష
పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఇక నుంచి వాళ్ల తల్లిదండ్రులకు శిక్ష విధిస్తామని చైనా ప్రకటించింది.
8.బ్రిటన్ లో కరోనా ఉదృతం
బ్రిటన్ లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది.బూస్టర్ డోసులు ఇస్తున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకపోవడం వైద్య నిపుణులకు సైతం ఆందోళన కలిగిస్తోంది.
9.నైజీరియాలో కాల్పులు : 43 మంది మృతి
నైజీరియాలో కాల్పుల మోతతో దద్దరిల్లింది.సోకోటో రాష్ట్రంలో ఓ గ్రామ మార్కెట్ పై సాయిధుడు చేసిన దాడిలో 43 మంది మరణించారు.
10.చైనా లో కరోనా .లాక్ డౌన్
చైనాలో కరోనా రోజు రోజుకీ విజృంభిస్తోంది.దీంతో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్న నగరాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు