ఈవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాట్యం సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతోంది.మీడియాలో కూడా నాట్యం గురించి పెద్ద ఎత్తున పబ్లిసిటీ జరుగుతోంది.
నాట్యం కోసం గతంలో ఎప్పుడు లేని విధంగా పలువురు ప్రముఖులు ముందుకు వచ్చి ప్రమోషన్ చేశారు.మొదటగా నాట్యం సినిమా ఫస్ట్ లుక్ ను రివీల్ చేసేందుకు మెగా కోడలు ఉపాసన కొనిదెల వచ్చింది.
ఆమె నాట్యం సినిమా ను జనాలకు పరిచయం చేసింది.ఆ తర్వాత బాలకృష్ణ ఒక పాటను విడుదల చేయడం జరిగింది.
అప్పుడు నాట్యం గురించి మరింత మందికి తెలిసింది.ఇటీవల రామ్ చరణ్ నాట్యం సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొని చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలియజేశాడు.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా భాగస్వామ్యం అయ్యాడు.చిరంజీవిని కలిసిన చిత్ర యూనిట్ సభ్యులు ఆశీర్వాదం తీసుకున్నారు.చిత్ర యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన చిరంజీవి ఇలాంటి సినిమా లను మరిన్ని చేసి తెలుగు నాట్యం పై అందరికి అవగాహణ కల్పించాల్సిన అవసరం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి కూడా నాట్యం గురించి మాట్లాడటం తో సినిమా గురించి మరింతగా ప్రాచుర్యం అయ్యింది.తెలుగు లో నాట్యం సినిమాను ఈవారంలోనే విడుదల చేస్తున్నారు.సంద్య రాజు మరియు రేవంత్ కోరు కోండ కలిసి నటించిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది అంటూ చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు.
తప్పకుండా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ నమ్మకం వ్యక్తం చేశాడు. చిరంజీవి శుభాకాంక్షలతో సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.