“మా” ఎన్నికల ఫలితాలు వచ్చినా గానీ.“మా” రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది.ఎన్నికలలో ఓడిపోయిన ప్రకాష్ రాజ్.ఎన్నికల రోజు అనేక అవకతవకలు జరిగినట్లు.రౌడీయిజం తో విష్ణు ప్యానల్ విజయం సాధించినట్లు చెప్పుకొచ్చారు.తమ ప్యానల్ కి చెందిన కుర్ర హీరో తనీష్ పై దాడి చేయడం జరిగిందని ఆ విజువల్స్ కోసం .ఎన్నికల అధికారి కృష్ణమోహన్ నీ… సంప్రదిస్తే అంటే సరైన స్పందన లేదని అసహనం వ్యక్తం చేశారు.తమ పోరాటం విష్ణు పైన కాదని “మా” ఎన్నికల అధికారి కృష్ణమోహన్ పైన అని.ఆ తరహాలో ఆయన వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈసీ పెట్టిన 7 కెమెరాల విజువల్స్ ఒక్కసారి చెక్ చేయాలనీ ప్రకాష్ రాజ్ కోరారు.
జూబ్లీ హిల్స్ స్కూల్ లో పెట్టిన కెమెరా విజువల్స్ చూడటం జరిగింది.కానీ ఎలక్షన్ కమిషనర్ పెట్టిన 7 సీసీ కెమెరాల విజువల్స్ ఇంకా చూడాలని.
ఈ క్రమంలో ఎన్నికల అధికారి తోనే.అస్సలు సమస్య ఉందని.
ప్రకాష్ రాజ్ వైరల్ కామెంట్ చేశారు.ఎలక్షన్ ఏ విధంగా కండక్ట్ చేసారు.? ఇంకా అనేక విషయాల పై తనకి అనుమానాలు ఉన్నాయని.“మా” అధ్యక్షుడు విష్ణు తో తనకు ఎటువంటి ప్రాబ్లం లేదని.ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.