చిత్తూరు జిల్లా, కాణిపాకం దేవస్థానం ఈవో వైఖరికి నిరసనగా ఓ మహిళా ఉద్యోగి సోమవారం కళ్లకు గంతలు కట్టుకొని ఈఓ కార్యాలయం ముందు వినూత్న రీతిలో నిరసన చేపట్టింది.కాణిపాకం దేవస్థానంలో ఆరం జ్యోతి శంకరమ్మ అనే మహిళ విధులు నిర్వహిస్తోంది.
ఈమెకు గత మూడు ఏళ్ల క్రితం పదోన్నతి రావాల్సి ఉంది.తనకు రావాల్సిన పదోన్నతిని కల్పించాలని ఈఓ వెంకటేష్ ను పలుమార్లు కోరినట్లు తెలిపారు.
అయితే ఆలయ ఈవో తనకు ప్రమోషన్ కల్పించకపోగా తన పట్ల అమానుషంగా మాట్లాడుతూ దౌర్జన్యం చేస్తున్నట్లు తెలిపారు.ప్రమోషన్ కల్పించాలని కోరుతూ ఈవో కార్యాలయానికి వెళ్లితే నీకు ప్రమోషన్ ఇవ్వను అంటూ మహిళా ఉద్యోగి అని కూడా చూడకుండా ఈఓ వెంకటేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు న్యాయం జరిగే వరకూ ఆందోళన కొనసాగిస్తానని ఆమె అన్నారు.