కాణిపాకం ఈవో వైఖరికి నిరసనగా మహిళ ధర్నా..

చిత్తూరు జిల్లా, కాణిపాకం దేవస్థానం ఈవో వైఖరికి నిరసనగా ఓ మహిళా ఉద్యోగి సోమవారం కళ్లకు గంతలు కట్టుకొని ఈఓ కార్యాలయం ముందు వినూత్న రీతిలో నిరసన చేపట్టింది.కాణిపాకం దేవస్థానంలో ఆరం జ్యోతి శంకరమ్మ అనే మహిళ విధులు నిర్వహిస్తోంది.

 Woman Protest Against Kanipakam Temple Eo Behavior, Woman Protest ,against ,kani-TeluguStop.com

ఈమెకు గత మూడు ఏళ్ల క్రితం పదోన్నతి రావాల్సి ఉంది.తనకు రావాల్సిన పదోన్నతిని కల్పించాలని ఈఓ వెంకటేష్ ను పలుమార్లు కోరినట్లు తెలిపారు.

అయితే ఆలయ ఈవో తనకు ప్రమోషన్ కల్పించకపోగా తన పట్ల అమానుషంగా మాట్లాడుతూ దౌర్జన్యం చేస్తున్నట్లు తెలిపారు.ప్రమోషన్ కల్పించాలని కోరుతూ ఈవో కార్యాలయానికి వెళ్లితే నీకు ప్రమోషన్ ఇవ్వను అంటూ మహిళా ఉద్యోగి అని కూడా చూడకుండా ఈఓ వెంకటేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు న్యాయం జరిగే వరకూ ఆందోళన కొనసాగిస్తానని ఆమె అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube