సాఫ్ట్వేర్ జాబ్ అంటే సగటు విద్యార్థి కల.దాన్ని సాధించేందుకు ఎంతలా కష్టపడుతుంటారో అందరికీ తెలిసిందే.
తమ కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని చెప్పుకునేందుకు తల్లి దండ్రులు ఎంతో మురిసిపోతుంటారు.అలాంటి జాబుల కోసం విద్యార్థులు చేసే ప్రయత్నాలు అంతా ఇంతా కాదు.
ఇందులో సెటిల్ అయితే చాలు జీతాలు ఎక్కువగా ఉంటాయని, జీవితంలో ఎదగొచ్చని, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా ఇందులో ఎదిగేందుకు మంచి అవకాశాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు.
కానీ అలంటి జాబులకు ఇప్పుడు డిమాండ్ తగ్గిపోతోంది.
ఈ రంగం గత ఏడాది నుంచి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.మిగతా రంగాల్లో కూడా డిజిటల్ టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో ఆయా రంగాల్లో మంచి జీతాలు కూడా రావడంతో ఈ రంగం నుంచి ఉద్యోగులు ఇతర రంగాల్లోకి వలసలకు క్యూ కడుతున్నారు.
క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి టెక్నాలజీని బేస్ చేసుకుని ఓటీటీ ఏఐ లాంటి టెక్నాలజీలో గట్టి పట్టున్న ఉద్యోగులకు ఇతర రంగాల్లోనే ఎక్కువ సాలరీ రావడం కూడా ఇందుకు ప్రధాన కారణం.
దీంతో పాటు కరోనా మహమ్మారి లాంటి విపత్తులు రావడంతో అన్ని కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తున్నాయి.దీంతో పని భారాన్ని తట్టుకోలేకపోవడంతో పాటు ఉద్యోగ భద్రత కూడా తగ్గిపోవడంతో చాలామంది ఐటీ సెక్టార్ను విడిచిపెట్టి సొంతంగా ఏదైనా స్టార్టప్ కంపెనీని పెట్టాలని చూస్తున్నారంట.ఇందుకోసం ఉద్యోగాన్ని వదిలేసి ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలని చాలామంది చూస్తున్నారంట.
ఇందులో భాగంగానే ఈ ఏడాదిలో చాలా వరకు ఉద్యోగులు ఐటీ కంపెనీల నుంచి బయటకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.ఏదేమైనా ఇది కొత్త తరానికి అవకాశాన్ని ఇచ్చే అంశం.
కొత్త జనరేషన్ స్టూడెంట్లకు అవకాశాలు దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.