1.ఎన్.ఆర్.ఐ కి టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి పదవి
ఏపీ టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శిగా ఎన్.ఆర్.ఐ మన్నవ మోహన్ కృష్ణ ను నియమిస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్న నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.మోహన్ కృష్ణ అమెరికాలోని జాతీయ తెలుగు సంఘాల లో ఒకటైన నాట్స్ కు అధ్యక్షుడిగానూ పని చేశారు.
2.విదేశీ టీచర్లకు కువైట్ ఎంట్రీ వీసాలు
కరోనా నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలు కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన సుమారు 700 మంది విదేశీ టీచర్లకు తాజాగా కువైట్ ఎంట్రీ వీసాలు జారీ చేసింది.
3.టీకా పొందిన వారికి అమెరికాలో అనుమతి
కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారందరినీ నవంబర్ 8 నుంచి తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది.
4.అంతరిక్షంలో సినిమా షూటింగ్ విజయవంతం
రష్యన్ సినీ బృందం తొలిసారిగా భూ కక్షలో విజయవంతంగా సినిమా షూటింగ్ పూర్తి చేసింది.
5.హైతీలో 17 మంది అమెరికన్ల కిడ్నాప్
హైతీ దేశంలో అమెరికాకు చెందిన మిషనరీల కిడ్నాప్ కలకలం రేపుతోంది 17 మంది అమెరికా మిషనరీలు కిడ్నాప్ అయినట్టు సమాచారం.
6.భారత్ ను వేడుకుంటున్న శ్రీలంక
విదేశీ మారక నిల్వలు పూర్తి తగ్గి , ద్రవ్యోల్బణం భారీగా పెరిగి, నిత్యావసరాలు భారీగా పెరిగి సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ఇప్పుడు భారత్ సహాయాన్ని కోరుతోంది.చమురు కొనేందుకు 50 కోట్ల డాలర్ల సాయం చేయాలని అభ్యర్డిస్తోంది.
7.రష్యాలో కరోనా విజృంభణ
రష్యాలో కరోనా తీవ్రత మరింత పెరిగిపోతోంది.గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా 1002 మంది మృత్యువాత పడ్డారు.
8.రోదసీ నౌకను ప్రయోగించిన చైనా
రోదసీ నౌక షేం ఝు -13 ని చైనా శనివారం ప్రయోగించింది.
9.భూటాన్ తో చైనా బీ ఐ ఒప్పందం
భూటాన్ తో తాజాగా చైనా కొత్త ఒప్పందం చేసుకుంది.చైనా భూటాన్ మధ్య అపరిష్కృత వివాదాల పరిష్కారానికి చైనా కొన్ని పద్ధతులను ప్రతిపాదించగా, దీనికి భూటాన్ అంగీకారం తెలిపింది.ఈ పరిణామాలపై భారత్ ఆందోళన చెందుతోంది.
10.షియా ముస్లిం లకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ హెచ్చరిక
ఇస్లామిక్ స్టేట్ (ISIS ) ఉగ్రవాద సంస్థ షియా ముస్లిం లకు హెచ్చరికలు పంపింది.వారు అత్యంత ప్రమాదకారులని , వారు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టబోము అంటూ ప్రకటించింది.