బాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్స్ హోస్ట్ లుగా టాక్ షో లు వచ్చాయి.వాటిల్లో కొన్ని మంచి విజయాన్ని సొంతం చేసుకోగా కొన్ని మాత్రం పర్వాలేదు అనిపించాయి.
ఇక తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారిలో అలీ టాక్ షో ను చాలా కాలం గా నిర్వహిస్తున్నాడు.ఆయన టాక్ షో కు మంచి పేరు వచ్చింది.
తెలుగు ప్రేక్షకులు అలీతో సరదాగా టాక్ షో ను ప్రతి వారం కు ఒక ఎపిసోడ్ చొప్పున ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు.ఇలాంటి సమయంలో స్టార్స్ మరింత మంది టాక్ షో లతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు.
పెద్ద ఎత్తున టాక్ షో లు మరియు గేమ్ షో లతో బుల్లి తెర పై ప్రముఖ స్టార్స్ కనిపిస్తున్నాయి.ఇటీవల సమంత హోస్ట్ గా సామ్ జామ్ అనే టాక్ షో వచ్చింది. రానా హోస్ట్ గా నెం.1 యారీ అనే టాక్ షో వచ్చింది.ఈ రెండు కూడా ఆహా లో మంచి స్ట్రీమింగ్ రేటింగ్ ను దక్కించుకుంది.ఇప్పుడు అంతకు మించిన రేటింగ్ ను దక్కించుకునేందుకు బాలయ్య రంగంలోకి దిగుతున్నాడు.
అద్బుతమైన కాన్సెప్ట్ అంటూ బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో గురించి నెటిజన్స్ లో ఆసక్తి పెంచే విధంగా ఆహా వారు తెగ ప్రకటిస్తున్నారు.పక్కా పైసా వసూల్ టాక్ షో అంటున్న ఆహా వారి నమ్మకం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది.బాలయ్య వంటి టాప్ హీరోను హోస్టింగ్ కు ఒప్పించడమే చాలా గొప్ప విజయం గా ప్రతి ఒక్కరు అంటున్నారు.ఇక బాలయ్య తో ఖచ్చితంగా ఒక మంచి ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన టాక్ షో ను ఆహా అందిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
గతంలో ఆహా లో వచ్చిన టాక్ షో లతో పోల్చితే డబుల్ వ్యూస్ మరియు రేటింగ్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.భారీ ఎత్తున ఖర్చు పెడుతున్న యూనిట్ సభ్యులకు భారీ ఎత్తున ఆదాయం రావడం పక్కా అంటున్నారు.
ఇది ఖచ్చితంగా ఒక రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుని ఆ టాక్ షో లతో పోల్చితే డబుల్ ధమాకా ఇస్తుందని అంటున్నారు.బాలయ్య టాక్ షో ను దీపావళి సందర్బంగా స్ట్రీమింగ్ చేయబోతున్నారు.