మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం ఇటీవల క్షీణించడంతో ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేయటం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవల కుటుంబ సభ్యులు జ్వరం నీరసం కారణంగా.ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు స్పష్టం చేశారు.
కాగా తాజాగా వైద్యులు… మన్మోహన్ సింగ్ కి పరీక్షలు నిర్వహించగా ఆయన అనారోగ్యానికి గల కారణం డెంగీ అని నిర్ధారణ అయింది.ఎయిమ్స్ వైద్యులు తాజాగా స్పష్టం చేశారు.అందువల్లే ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గినట్లు… స్పష్టం చేశారు.అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని రక్తం ప్లేట్ లెట్ల కూడా పెరుగుతుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా పార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీ మన్మోహన్ నీ పరామర్శించడం జరిగింది.ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో కరోనా బారిన పడ్డారు మన్మోహన్.
దీంతో ఆయనకి రోగ నిరోధక శక్తి తగ్గటం తో ఇటీవల రకరకాల వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.పరిస్థితి ఇలా ఉంటే ఆయనకు డెంగీ అని ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించడంతో.
పాటు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలపడంతో.వస్తున్నా పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టి నట్లు అయింది.