తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలిచిన నందమూరి బాలయ్య గురించి, ఆయన నటన గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా నిలిచాడు.
ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ యంగ్ హీరోలకు పోటీగా దూసుకుపోతున్నాడు.ఇదిలా ఉంటే బాలయ్య అల్లు అరవింద్ తో ఓ బిజినెస్ స్టార్టజీ ప్రారంభించనున్నాడు.
ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.
తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్య ఎంతో మంచి నటుడుగా నిలిచి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా త్వరలోనే ఓ రియాలిటీ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అది కూడా ఆహా డిజిటల్ వేదికగా ఓ చాట్ షో చేయనున్నాడు.
అందులో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలను తెలుసుకోనున్నాడు.
మొత్తానికి ఓటీటీ వేదికగా సరికొత్త కాన్సెప్ట్ తో రానున్నాడు.ఇక ఈ వేదిక చిరంజీవి మెగా ఫ్యామిలీకి చెందిన వారిది.ఈ షోను అన్ స్టాపబుల్ అనే పేరుతో ప్రారంభించనున్న ఈ షోకు చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ భాగస్వామిగా ఉన్నాడు.
మొత్తానికి బాలయ్య అల్లు అరవింద్ తో బిసినెస్ స్టార్టజీతో ముందుకు దూసుకుపోతున్నాడు.
ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు పలు రియాలిటీ షోలలో హోస్టింగ్ చేసారు.చాలావరకు బుల్లితెరపైనే ప్రసారం చేశారు.కానీ ఓటీటీ వేదికగా మాత్రం ఏ హీరో కూడా ఏ షో లను చేయలేదు.
ఇక టాలీవుడ్ స్టార్ హీరో అయినా బాలయ్య ఈ వేదికగా ఈ షోతో సెలబ్రెటీలను, ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.ఇక త్వరలోనే ఈ షో గురించి మరిన్ని అప్ డేట్ లను ప్రకటించనున్నారు.