నాగ శౌర్య హీరోగా లక్ష్మి సౌజన్య డైరక్షన్ లో వస్తున్న సినిమా వరుడు కావలెను.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో నాగ శౌర్య సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుంది.సినిమాకు సంబందించిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.ఇక సినిమా దసరా బరిలో వస్తుందని ఎనౌన్స్ చేశారు.కాని ఆల్రెడీ దసరాకు మూడు సినిమాలు రిలీజ్ అవడంతో దసరా రేసు నుండి నాగ శౌర్య వరుడు కావలెను తప్పుకుంది.అయితే దసరా రేసులో నిలవని వరుడు కావలెను నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడన్నది రివీల్ చేసింది.
నాగ శౌర్య వరుడు కావలెను సినిమా అక్టోబర్ 29న రిలీజ్ ఫిక్స్ చేశారు.నవంబర్ 4న దివాళి కానుకగా క్రేజీ సినిమాలు వస్తున్నా సరే నాగ శౌర్య దానికి వారం ముందు తన సినిమాతో వస్తున్నాడు.
ఓ పక్క లక్ష్య అంటూ ఓ కమర్షియల్ సినిమాతో వస్తున్న నాగ శౌర్య వరుడు కావలెను సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించాలని చూస్తున్నాడు.మరి నాగ శౌర్య ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఫలితం ఉంటుందా లేదా అన్నది చూడాలి.