నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లెటర్ రాసిన తమిళనాడు సీఎం స్టాలిన్..!!

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లెటర్ రాశారు.మహమ్మారి కరోనా కారణంగా చిన్న పెద్ద మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని ఈ క్రమంలో.

 Tamil Nadu Cm Stalin Writes Letter To Chief Ministers Of Four States Tamil Nadu,-TeluguStop.com

టపాసుల తయారీ పై దాదాపు 8 లక్షల మంది తమిళనాడు రాష్ట్రంలో బతుకుతున్నారని వారి పొట్ట కొట్టే పని చేయొద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకు స్టాలిన్ లెటర్ రాయడం జరిగింది.ఒకవేళ ఆ విధంగా చేస్తే తమిళనాడు ఆర్థిక వ్యవస్థ పై పెను ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు.

శివకాశి లో ఉన్న బాణాసంచా పరిశ్రమ తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమైన పరిశ్రమలో ఒకటని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.

ఈ పరిశ్రమపై దాదాపు 8 లక్షల మంది బతుకుతున్నారని అతి పెద్ద పరిశ్రమ ఇదేనని స్పష్టం చేశారు.

వాయు కాలుష్యం నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టు బాణాసంచాలు పై నిషేధం విధించిన క్రమంలో.కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది.అయితే తే.గీ వాయు కాలుష్యం నేపథ్యంలో మీరు న్యాయస్థానం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటున్నారా అన్న విషయం తెలుసు.కానీ శివకాశి బాణసంచా పరిశ్రమల్లో గ్రీన్ క్రాకర్స్ మాత్రమే తయారు.చేస్తున్నారు వీటివల్ల పెద్ద కాలుష్యం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.

Telugu Cm Stalin, Fireworks, Tamil Nadu-Latest News - Telugu

టపాసుల పై నిషేధం సరైన నిర్ణయం కాదని వీటిపై ఇతర దేశాల్లో కూడా నిషేధం లేదని లక్షలాది మంది ప్రజల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని… టపాసులు నిషేధంపై పునరాలోచన చేయాలని.ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, ఒడిష ముఖ్యమంత్రులకు లేఖలో తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube