మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యం కారణంగా ఢిల్లీ ఎయిమ్స్ హాస్పత్రి లో.చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
నార్మల్ జ్వరం కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయినా ఆయన.ఇటీవల కోలుకొని నీరసంగా ఉండటంతో రెస్ట్ తీసుకుంటున్నారు.ఇటువంటి తరుణంలో.మన్మోహన్ సింగ్ కుమార్తె డామన్ సింగ్ తండ్రి ఆరోగ్యం పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.తండ్రి ఆరోగ్యం పరవాలేదని.కానీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో పరామర్శించి వారి సంఖ్య పరిమితం చేసినట్లు స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పరామర్శించడం .త్వరగా కోలుకోవాలని కోరుకోవడం ఆనందంగా ఉందని.అయితే అదే సమయంలో ఆయన ఫోటోలు తీయడం దారుణమని సీరియస్ అయ్యారు.కుటుంబ సభ్యులు మాటలు పట్టించుకోకుండా ఫోటోలు తీశారని, ఫోటోగ్రాఫర్ నీ.లోనికి తీసుకు వెళ్ళ కూడదు అని చెప్పినా గాని.కేంద్రమంత్రి వినిపించుకోకుండా.
ఇష్టానుసారంగా వ్యవహరించారని.మన్మోహన్ సింగ్ కుమార్తె కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పై.సీరియస్ వ్యాఖ్యలు చేస్తూ ప్రకటన ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది.