ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు.దేవుళ్ళు.
హిందూ మతం గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తున్నది పేర్కొన్నారు.బూట్లు వేసుకుని ఆలయంలోకి ప్రవేశించే చంద్రబాబు… సీఎం జగన్ ను విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మూడు స్థానాలు కూడా రావని పేర్కొన్నారు.ఆలయంలో బూట్లు వేసుకుని పూజలు చేసుకునే చంద్రబాబు.
సీఎం జగన్ నీ విమర్శించటం దారుణమని అన్నారు.
విజయవాడ నగరంలో చంద్రబాబు హయాంలో దాదాపు 40 దేవాలయాలను కూల్చేయడం జరిగిందని.
వైసీపీ అధికారంలోకి వచ్చాక తొమ్మిది ఆలయాలను పునర్ నిర్మించడం జరిగిందని స్పష్టం చేశారు.సీఎం జగన్ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం జరిగిందని.
ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని.తింటుంటే దానిని వాసన చూస్తున్నట్లు.
టిడిపి నేతలు వ్యాఖ్యలు చేయడం దారుణమని.దేవుళ్ళు కూడా క్షమించరని పేర్కొన్నారు.
దేవాలయాలపై దేవుళ్ళ పై రాజకీయాలు చేస్తే ఇప్పటికే 23 స్థానాలకు పరిమితం అయ్యారు.రానున్న రోజుల్లో మూడు స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి రావని వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.