కోవిడ్ ప్రభావం తర్వాత చాలా సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి.ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలు వరుసగా ఉన్నాయి.
అందులో చాలావరకు మెగా హీరోల సినిమాలే ఉండగా ఆ సినిమాలు విడుదలకు సరిగ్గా నోచుకోలేకపోతున్నాయి.కారణం వారికి సెంటిమెంట్ కలిసి రాకుండా అడ్డుగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఇంతకీ అసలు ఏమి జరిగిందంటే.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను మొదట మే 13న విడుదల చేస్తామని సినీ బృందం ప్రకటించారు.కానీ ఈ డేట్ కు ఈ సినిమా ఫిక్స్ అవ్వలేకపోయింది.ఇక అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా కూడా ఆగస్టు 13న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు.కానీ ఈ సినిమా కూడా విడుదల కాలేకపోయింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా అక్టోబర్ 13 న విడుదలకు సిద్ధంగా ఉందని గతంలో తెలిపారు.కానీ ఈ సినిమా ఆలస్యం కావడంతో ఈ డేట్ కూడా వాయిదా పడింది.
దీంతో మళ్లీ ఈ సినిమాలకు మరో డేట్ ను ఫిక్స్ చేయగా ప్రస్తుతం ఆ సమయం వరకు సినిమా పూర్తి కావడానికి తీరిక లేకుండా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.మొత్తానికి మెగా హీరోలకు తమ సినిమా విడుదలకు 13 వ తేదీ కలిసి రానట్లుగా అనిపించింది.