టాలీవుడ్ ఇండస్ట్రీకి బుట్ట బొమ్మగా నిలిచిన పూజా హెగ్డే గురించి అందరికి తెలిసిందే.అతి తక్కువ సమయంలో వరుస ఆఫర్ లతో ఓ రేంజ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.చాలా వరకు ఈమె కోసం దర్శకనిర్మాతలు కూడా బాగా ఎదురుచూస్తుంటారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈమె ఆస్తి గురించి కొన్ని విషయాలు బయటపడ్డాయి.
నిజానికి ఈమె తన సినిమాలకు ఎక్కువ పారితోషకాన్ని అందుకుంటుంది.
ఒక్క సినిమాకి దాదాపు రెండు కోట్ల కంటే ఎక్కువగా తీసుకుంటుందని టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈమెకున్న ఆస్తి గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈమెకు ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సముద్ర తీరంలో కోట్లలో విలువ చేసే త్రిబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ ఉందని తెలుస్తుంది.
ఇక ఈమెకు మొత్తం రూ.51 కోట్ల వరకు ఆస్తి ఉందని తెలుస్తుంది.ఈమె దగ్గర భారీ ఖరీదైన కారు కొన్ని ప్లాట్లు ఉన్నట్లు సమాచారం.
కేవలం సినిమాల్లోనే కాకుండా యాడ్స్ లలో కూడా ఎక్కువ పారితోషికం తీసుకుంటుందని తెలుస్తుంది.ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.
తాను నటించిన మోస్ట్ ఎలిజిబుల్ సినిమా ఈ రోజు విడుదలైంది.అంతేకాకుండా ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలో బిజీగా ఉంది.
వీటితో పాటు పలు సినిమాలలో వరుసగా అవకాశాలు అందుకుంది.