ఇప్పటి వరకూ భార్యలను హింసించిన ఎన్నారై భర్తల గాధలు విని ఉంటాము, ఏదో ఒక చోట ఫలానా ఎన్నారై భర్త భార్యను హింసించాడు, కట్నం కోసం వేధించాడు, అకారణంగా చంపేశాడు అంటూ ఎన్నారైలను బూచిలుగా చూపించన సంఘటనలే చూశాము కానీ మహిళా ఎన్నారైలలో కూడా కి “లేడి” ఎన్నారైలు ఉంటారని, కొన్ని సంఘటనలు ఋజువు చూపిస్తున్నాయి.ఎన్నారైలలో భర్తలే కాదు, భార్యలు కూడా వేధించే వాళ్ళు ఉంటారని తాజాగా జరిగిన సంఘటన సాక్ష్యంగా నిలిచింది.
వివరాలలోకి వెళ్తే.
పంజాబ్ కు చెందిన ఓ యువతికి ఇస్సా ఆస్ట్రేలియా వెళ్ళాలని కోరిక ఉండేది అక్కడి చదువుకుని స్థిరపడాలని భావించింది అయితే తన వద్ద అంత డబ్బు లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఆలోచనలో పడింది.
ఈ క్రమంలోనే ఆకాశ్ దీప్ అనే వ్యక్తితో వివాహానికి ఒప్పుకుంది.అయితే పెళ్లి చేసుకోవాలంటే తనను ఆస్ట్రేలియాలో చదివించాలని, అక్కడికి వెళ్ళగానే ఆమె భర్తకు స్పాన్సర్ వీసా ఇవ్వాలని ఇరు కుటుంబాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ అంగీకారంతోనే పెళ్లి కూడా జరిగింది.కొన్ని రోజులకు కోడలి కోసం రూ.14 లక్షలు ఖర్చు చేసి ఆస్ట్రేలియా పంపారు అత్తమామలు.కట్ చేస్తే.
ఆస్ట్రేలియా వెళ్ళిన ఇస్సా కొంత కాలం బాగానే ఉంది.మొదట్లో స్పాన్సర్ వీసా భర్తకు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఇస్సా ఊహంచని విధంగా భర్తతో గొడవలు పడటం మొదలు పెట్టింది.
చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ భర్త వీసా కోసం చేసిన అభ్యర్ధన విరమించుకునేలా చేసింది.ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టుగా గొడవను మరింత ఎక్కువ చేసి భర్త కోసం ఇచ్చిన తన స్పాన్సర్ షిప్ ను వెనక్కి తీసుకుంది.
దాంతో ఆమె అసలు బండారం బయటపడటంతో తన ఎన్నారై భార్య మోసం చేసింది అంటూ పోలీసులను ఆశ్రయించాడు ఆకాశ్.దాంతో ఇస్సా పై ఆమె కుటుంభ సభ్యులపై కేసు నమోదు చేశారు పోలీసులు.