టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను అమాంతం పెంచుకున్నాడు.
ఇక విజయ్ కు ఫ్యాన్స్ రౌడీ స్టార్ అనే ముద్దు పేరు కూడా పెట్టేసుకున్నారు.తాజాగా రౌడీ స్టార్ తన అభిమానులతో ముచ్చటించారు.
ఫ్యాన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు, కోరికలకు రిప్లై ఇస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేసాడు.
నిన్న రాత్రి విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు.
తన ఫ్యాన్స్ అంత కోరిన కోరికలకు లేదు, కాదు అనకుండా జవాబు చెప్పడమే కాదు వాళ్ళ కోరికలను కూడా నెరవేరుస్తానని తెలిపాడు.ఒక అభిమాని మీతో లైగర్ సినిమా చూడాలని ఉందని అడగడంతో నువ్వు ఏ ఊర్లో ఉంటే అక్కడ ఉన్న థియేటర్ లో కలిసి లైగర్ మూవీ చూద్దామని తెలిపాడు.
మరొక అభిమాని కోరిక ప్రకారం తన ఇంటికి భోజనానికి వస్తానని మాట ఇచ్చాడు.ఇక ఇంకొక ఫ్యాన్ ప్రభాస్ తో కలిపించండి అని కోరగా ఓకే డన్ అంటూ చెప్పాడు.
ఇంకొక అభిమానికి విజయ్ ప్రారంభించిన ఏవిడి మల్టీఫ్లేక్స్ లో ఏడాది పాటు ఏ సినిమా అయినా ఫ్రీ గా చూడవచ్చు అని చెప్పి సర్ప్రైజ్ చేసాడు.
ఇలా తన అభిమానుల కోరికలకు ఓకే చెప్తూ ఫ్యాన్స్ తో ముచ్చటించారు.
పండగ సందర్భంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన విజయ్ కాసేపు సరదాగా తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించారు.ఆ తర్వాత ఫ్యాన్స్ అందరి అభిమానానికి థాంక్స్ తెలిపాడు.
ఇక విజయ్ ప్రెసెంట్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విజయ్ తన స్టార్ డమ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు.బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తం గా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.