టాలీవుడ్ మాస్ రాజా వరుస ప్లాపులతో సతమత మవుతున్న సమయంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్సినిమాతో రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.అదే జోష్ తో వరస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఆ జోరులోనే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.ఈ సినిమాలో విలన్ గా అర్జున్ నటిస్తుండగా.
అనసూయ కూడా కీలక పాత్రలో నటిస్తుంది.దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఇక ఖిలాడీ సెట్స్ మీద ఉండగానే వరుస సినిమాలు ప్రకటిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు.
ప్రెసెంట్ రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాను శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇక ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వకముందే మరొక సినిమాను ప్రకటించాడు.
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.ఈ రోజు విజయ దశమి సందర్భంగా రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కే సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసారు.
ఈ సినిమా టైటిల్ ను ‘ధమాకాఅనే ఫిక్స్ చేయడంతో రవితేజ అభిమానులు మాస్ రాజా కు తగ్గ టైటిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో కూడా రవితేజ డ్యూయెల్ రోల్ లోనే నటిస్తున్నట్టు తెలుస్తుంది.ఈ పోస్టర్ చూస్తేనే అర్ధం అవుతుంది.ఈసారి కూడా రవితేజ క్రాక్ పుట్టించడం ఖాయం అని.ఇక ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళ బోతుంది.