టాలీవుడ్ నిర్మాణ రంగంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ కి ఒక విశిష్టమైన స్థానం ఉన్న సంగతి తెలిసిందే.ఎన్నో ప్రతిష్టాత్మకమైన సినిమాలు ఈ బ్యానర్ లో తెరకెక్కడం జరిగింది.
అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో గీతా ఆర్ట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ బ్యానర్ లలో ఒకటిగా నిలిచింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓటిటి హవా ఎక్కువగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
మహమ్మారి కరోనా కారణంగా సినిమా థియేటర్లు క్లోజ్ అయిన క్రమంలో చాలావరకు సినిమాలు ఓటిటీ లో రిలీజ్ అవుతున్నాయి.వెబ్ సిరీస్ ఇంకా పలు టాక్ షోలు.
కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో.ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ నీ ఆకట్టుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో ఆహాఓటిటిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.బడా బడా ఓటీటీ సంస్థలకు మంచి పోటీ ఇస్తూ తెలుగువాడి సత్తా చాటుతోంది.
అల్లు అరవింద్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఓటీటీ సంస్థ లో.తాజాగా నందమూరి బాలయ్య బాబు చేత అన్ స్థాపబుల్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు.అధికారికంగా ఈ కార్యక్రమం భారీ ఏర్పాట్లు చేసి ప్రకటించడం జరిగింది.ఈ సందర్భంగా కార్యక్రమంలో.బాలయ్య బాబు.అల్లు అరవింద్ తో పాటు చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ బాలయ్య బాబు ని కొనియాడారు.తెరపైనే బాలయ్య బాబు నటిస్తారని, తెర వెనకాల నటుడు కాదని కోపం ఉంటే కోపంసంతోషంగా ఉంటే సంతోషం.బయటకు చూపించే చేస్తారని కల్మషం లేని వ్యక్తి అని తెలిపారు.ఇటువంటి గొప్ప లక్షణాలు కలిగిన బాలయ్య బాబుతో అన్ స్థాపబుల్ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని ఎంతో.
సపోర్ట్ చేస్తున్నారు అంటూ అల్లు అరవింద్ బాలయ్య పై పొగడ్తల వర్షం కురిపించారు.