ఇటీవలే మా ఎలక్షన్స్ ముగిసిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇందులో మంచు విష్ణు గెలిచిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే.
అయితే ఈ సందర్భంగా 16వ తేదీన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడానికి మోహన్బాబు అలాగే మంచు విష్ణు బాలకృష్ణ ఇంటికి వెళ్లి అతని తో సమావేశం అయ్యారు.అందుకు సహకరించినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు.
అనంతరం బాలకృష్ణ ఇంటి నుంచి బయటకు వచ్చిన మోహన్ బాబు, విష్ణు మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు బాలకృష్ణ ను పొగడడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించారు.
ఎన్టీఆర్ కి ప్రతిరూపం బాలకృష్ణ అనే మోహన్ బాబు తెలిపారు.అంతేకాకుండా గత ఎన్నికల నాటి పరిస్థితులను మనసులో ఉంచుకోకుండా మద్దతు ఇచ్చారని, బాలకృష్ణ సంస్కారవంతుడని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా మా భవనం విషయంలో అండగా ఉంటామని బాలక్రిష్ణ హామీ ఇచ్చారని తెలిపారు.అలాగే రాజకీయాలకు, మా ఎన్నికలకు సంబంధం ఏమిటో కానీ మోహన్ బాబు మాత్రం ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని మరీ చేశాను అన్నట్టుగా మాట్లాడటం విశేషం.
ఇక మంచు విష్ణు మాట్లాడుతూ.ఇండస్ట్రీలో పెద్దలు అందరినీ కలుస్తున్నానని, అందరినీ కలుపుకొని వెళ్తానని అని తెలిపారు.ఇప్పటికే కైకాల సత్యనారాయణ, శ్రీనివాస రావు, పరుచూరి బ్రదర్స్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు.ఇక రేపో మాపో కూడా చిరంజీవిని కలుస్తానని, మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న విష్ణు ప్రమాణస్వీకారం మాత్రం విడిగా చేయాలనుకుంటున్నారు.
ఈనెల 16వ తేదీన ఉదయం 11 గంటల 45 నిమిషాలకు ఎన్నికల అధికారి వీరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.ఇందు కోసం రాజీనామా చేసిన ప్రకాష్ రాజ్ ప్యానల్ ను కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు.