మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఈ ఫలితాల గురించి జోరుగా చర్చ జరుగుతోంది.ఎన్నికల ఫలితాలకు సంబంధించి కొంతమంది ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులను సపోర్ట్ చేస్తుంటే మరి కొందరు మాత్రం విష్ణు ప్యానల్ సభ్యులను సపోర్ట్ చేస్తున్నారు.
నటుడు మురళీమోహన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి మాట్లాడుతూ మద్రాస్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత తాను అసోసియేషన్ గురించి ప్రపోజల్ పెట్టానని మురళీమోహన్ అన్నారు.
ఆ సమయంలో అందరూ చప్పట్లు కొట్టారని మురళీమోహన్ చెప్పుకొచ్చారు.
అప్పుడు ఎలక్షన్స్ లేకుండా కమిటీ ఏర్పాటు చేశామని మురళీమోహన్ తెలిపారు.ఆ తర్వాత లోగోను క్రియేట్ చేశామని మా ఇంట్లోనే ఆఫీస్ ఉండేదని మురళీమోహన్ చెప్పుకొచ్చారు.
ఏ ఆర్టిస్ట్ కూడా అనాథ శవంగా వెళ్లకూడదని మొదట తాము భావించామని మురళీమోహన్ పేర్కొన్నారు.పి.
ఎల్.నారాయణ అనే వ్యక్తి ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బంది పడ్డాడని మురళీమోహన్ పేర్కొన్నారు.
ఆ సమయంలో ఆయన కారులో చచ్చిపోయాడని రాజబాబు తమ్ముడు చిట్టిబాబు ఈ విషయాన్ని వెల్లడించారని మురళీమోహన్ చెప్పుకొచ్చారు.ఆయనను ఊరేగింపుగా తీసుకొని వెళ్లి దహన సంస్కారాలు చేశామని మురళీమోహన్ తెలిపారు.
రాజనాల ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడును కలిసి ఆయనకు ఆపరేషన్ జరిగేలా చూశామని మురళీమోహన్ అన్నారు.
చెన్నైలో రాజనాల చనిపోయారని ఆ సమయంలో చంద్రబాబు ఫ్లైట్ లో డెడ్ బాడీ వచ్చేలా చేశారని మురళీమోహన్ తెలిపారు.అసోసియేషన్ లోకి డబ్బులు వచ్చిన తరవాత పదవి మీద ఇష్టంతో ఆ పదవికి పోటీ చేసేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని మురళీమోహన్ చెప్పుకొచ్చారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రాబోయే రోజుల్లో పోటీ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.