టాలీవుడ్ నటులలో ఒకరైన మోహన్ బాబు ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే సినిమాలలో నటిస్తున్నారు.
ప్రస్తుతం మోహన్ బాబు చేతిలో సన్నాఫ్ ఇండియా అనే సినిమా ఉండగా ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.అయితే మోహన్ బాబు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత బాలకృష్ణను కలిసి అనేక విషయాల గురించి చర్చించారు.
ఈ భేటీలో మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా పాల్గొన్నారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో మద్దతు ఇచ్చిన బాలకృష్ణకు మోహన్ బాబు కృతజ్ఞతలు చెప్పారు.
బాలకృష్ణ సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ మోహన్ బాబు ప్రశంసలతో ముంచెత్తారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ శాశ్వత భవన నిర్మాణం గురించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభివృద్ధి గురించి బాలయ్యతో చర్చించానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
బాలకృష్ణను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నయ్య సీనియర్ ఎన్టీఆర్ తనను బాలకృష్ణ ఇంటికి పంపించినట్టుగా ఉందని మోహన్ బాబు పేర్కొన్నారు.
2019 ఎన్నికల సమయంలో తాను మంగళగిరిలో బాలకృష్ణ అల్లుడు లోకేశ్ కు వ్యతిరేకంగా వైసీపీ తరపున ప్రచారం చేశానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.ఆ సమయంలో మంగళగిరిలో వైసీపీ విజయం సాధించిందని మోహన్ బాబు పేర్కొన్నారు.
ఆ విధంగా జరిగినా బాలకృష్ణ మాత్రం ఆ విషయాలను అస్సలు పట్టించుకోకుండా విష్ణుకు మద్దతు ఇచ్చాడని మోహన్ బాబు తెలిపారు.బాలకృష్ణ విష్ణుకు ఓటు వేసి గెలిపించారని ఫోన్ చేసి అడిగిన వెంటనే మద్దతు ఇచ్చారని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఈ నెల 16వ తేదీన ప్యానల్ సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుందని విష్ణు తెలిపారు.
తన తండ్రి ఏ విధంగా సపోర్ట్ చేశారో బాలయ్య కూడా అదే విధంగా సపోర్ట్ చేశారని విష్ణు పేర్కొన్నారు.