అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో అఖిల్ బుట్టబొమ్మ పూజా హెగ్డే తో రొమాన్స్ చేయబోతున్నాడు.అందుకే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఇక దసరా కానుకగా ఈ సినిమా రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్.
ఈ సినిమా కోసం నిర్మాత బన్నీ వాసు కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో ఆయన ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు.అఖిల్ ఇంతకు ముందు సినిమాల కన్నా భిన్నంగా ఈ సినిమా చూస్తారని తెలిపాడు.
ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ లేవని యూత్ కు కనెక్ట్ అయ్యే విధంగా మాత్రమే టచ్ చేశామని మిగతాది వినోదాన్ని పంచుతూ వెళ్లామని తెలిపాడు.
సున్నితమైన ప్రేమ, అందులోని గాఢతను తెలిపే ఒక మంచి ప్రేమ కథను తెరకెక్కించామని ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి తమని తాము అందులో ఊహించుకునేలా ఉంటుందని బన్నీ వాసు తెలిపారు.
ఇక ఈ సినిమా మెయిన్ పాయింట్ కూడా రివీల్ చేసారు.పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి? పెళ్లి తర్వాత ఎలా ఉండాలి?అనే అంశాన్ని ఈ సినిమాలో చర్చించామని తెలిపారు.
తల్లిదండ్రులు చెప్పని సున్నితమైన విషయాల గురించి ఈ సినిమాలో చూపించామని ప్రతి ఒక్కరు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారని తెలిపారు.ఇక ఈ సినిమాలో అఖిల్, పూజా రొమాన్స్ కూడా హై లెవల్లో ఉంటుందని ఇప్పటికే విడుదల అయినా పోస్టర్స్ చూస్తేనే తెలుస్తుంది.మరి ఈ సినిమా ఏ రేంజ్ లో అభిమానులకు కనెక్ట్ అవుతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.