మహమ్మారి కరోనా కారణంగా ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్లలో షోలకు 50 శాతం మాత్రమే అనుమతులు ఇస్తూప్రదర్శనలకు పర్మిషన్ ఇవ్వడం తెలిసిందే.రెండు నెలల క్రితం నుండి సినిమా థియేటర్లకు అనుమతులు ఇచ్చినా గాని 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉండటంతో.
టాలీవుడ్ నిర్మాతలు ఈ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటూ అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా థియేటర్లలో 100% ఆక్యుపెన్సీ కి.అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.రేపటి నుండే ఇది అమల్లోకి రానుంది.ఇదే క్రమంలో రాష్ట్రంలో ఖరీఫ్ యు రాత్రి 12 నుండి ఉదయం 5 గంటల వరకు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో సెకండ్ షోకి అడ్డంకులు తొలగిపోయాయి.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మహా సముద్రం, పెళ్లి సందడి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.ఈ మూడు సినిమాలు రెండు రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం థియేటర్లకు 100% ఆక్యుపెన్సీ అనుమతులు ఇవ్వటంతో.
దసరా సీజన్ కావడంతో కలెక్షన్లకు కొదవ ఉండదని నిర్మాతలు భావిస్తున్నారు.