రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తో ఉద్యోగ సంఘాల నాయకులు భేటీ అయ్యారు.పిఆర్సి ఇంకా ఇతర సమస్యలపై చర్చించడం జరిగింది.
చర్చల అనంతరం సజ్జల రామకృష్ణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కరోనా సంక్షోభం కారణంగా ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్న మాట వాస్తవమే అని స్పష్టం చేశారు.ఇదే సమయంలో జీతాలు ఆలస్యం అవటం కూడా ఇబ్బందికరమెనని.
ఉద్యోగ భద్రత విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.
అంత మాత్రమే కాక ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన్ ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శిస్తే లేదని ఉద్యోగ సంఘాలు అడగకముందే ప్రభుత్వం ఐఆర్.
ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.ఇక ఇదే తరుణంలో ఈ నెల చివరకు పిఆర్సి సమస్య.పరిష్కారమవుతుందని నవంబర్ చివరి నాటికి ఉద్యోగస్తులు ఇతర సమస్యలు మొత్తం కొలిక్కి వస్తాయి అని స్పష్టం చేశారు.ఉద్యోగస్తులు లేకపోతే ప్రభుత్వం లేదని.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగస్తులకు ప్రాధాన్యత పెరిగిందని పథకాలు అమలు బాధ్యత మొత్తం ఉద్యోగుల పైన ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.