అధిక బరువు.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందర్నో వేధిస్తున్న సమస్య ఇది.అధికంగా తినడం వల్లే బరువు పెరుగుతారని చాలా మంది బలంగా నమ్ముతుంటారు.కానీ, ఒత్తిడి, శారీరక శ్రమ లేక పోవడం, కంప్యూటర్ల ముందు గంటలు తరబడి కూర్చుని పని చేయడం, శరీరంలో పోషకాల కొరత, థైరాయిడ్, మద్యం అలవాటు, పలు రకాల మందుల వాడకం ఇలా రకరకాల కారణాల వల్ల కూడా బరువు పెరుగుతారు.
అయితే కారణం ఏదైనప్పటికీ.బరువు తగ్గాలనుకునే వారికి కొన్ని కొన్ని ఫ్రోర్స్(పిండ్లు) అద్భుతంగా సహాయపడతాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగిపిండి.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో పోషక విలువలను అందిస్తుంది.
ముఖ్యంగా బరువును తగ్గించడంలో రాగి పిండి సూపర్గా సహాయపడుతుంది.కొవ్వు పెంచే ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ కంటే రాగి పిండితో జావ, దోసె వంటివి చేసుకుని తీసుకుంటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.
మరియు రాగి పిండితో ఉండే ఫైబర్, అమైనో యాసిడ్స్ శరీరంలో కొవ్వును క్రమక్రమంగా కరిగిస్తాయి.
అలాగే జొన్నపిండి కూడా బరువును తగ్గించగలదు.రాత్రి వేళలో వైట్ రైస్, గోధుమ పిండితో చేసిన చపాతీలు తీసుకోవడం కంటే జొన్న పిండితో చేసిన రొట్టెలు తీసుకోవడమే ఎంతో మేలు.జొన్న రొట్టెలను తీసుకుంటే వేగంగా బరువు తగ్గుతారు.
చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.శరీరానికి ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది.
మరియు మలబద్ధకం సమస్య కూడా ఉండదు.
ఇక ఓట్స్ పిండీ వెయిట్ లాస్కి గ్రేట్గా సహాయపడుతుతుంది.
ఓట్స్ ఫ్లోర్తో దోసె, ఇడ్లీ, లడ్డూ వంటివి చేసుకుని తీసుకుంటే.కడుపు ఎక్కువగా సమయం పాటు నిండుగా ఉంటుంది.
దాంతో చిరుతిండ్లపై మనసు మల్లకుండా ఉంటుంది.ఫలితంగా వెట్ లాస్ అవుతారు.
పైగా ఓట్స్ ఫ్లోర్ డైట్లో ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.రక్త పోటు కంట్రోల్లో ఉంటుంది.
మరియు జీర్ణ వ్యవస్థ చురుగ్గా పని చేస్తుంది.