జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఈ రోజు హైదరాబాదులో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కలిశారు.ఈ క్రమంలో ఈ నెల 23 వ తారీఖున హైదరాబాదులో బిసి సంఘ సంక్షేమ నిర్వహించే జాతీయ స్థాయి సెమినార్ సమావేశాన్ని కి రావాలని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పవన్ వారి ఆహ్వానాన్ని స్వీకరిస్తూ కచ్చితంగ .పాల్గొంటానని వారికి హామీ ఇచ్చారు.బీసీ సంఘాలు చేస్తున్న ఉద్యమం తాలూకు భావజాల వ్యాప్తికి.జనసేన కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఎప్పటినుండో అధికారానికి దూరంగా ఉన్న కులాల కోసం పని చేయాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు.అదే రీతిలో ఏళ్లతరబడి ఇటువంటి విషయాల్లో బీసీ సంఘం నాయకులు ఉద్యమాలు చేస్తున్నఎన్నికల సమయం వచ్చేసరికి ఎవరికివారు అన్న తరహాలో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి రాజకీయ పరమైన అవగాహన అవసరమని దీనికి ఎక్కడ చర్చ జరిగినా ఖచ్చితంగా పాల్గొంటాను అని పవన్ స్పష్టం చేశారు.అదే రీతిలో యువతకు రాజకీయ నాయకత్వం అప్పగించాలని బిసి ఉద్యమానికి కచ్చితంగా జనసేన మద్దతు ఉంటుందని.
తనని కలిసిన బీసీ సంఘ సంక్షేమ నాయకులకు పవన్ హామీ ఇచ్చారు.