మాఅధ్యక్ష ఎన్నికల ప్రచారం నుండి శ్రీకాంత్ వర్సెస్ నరేష్ అనే రీతిలో వ్యవహారం నడుస్తున్న సంగతి తెలిసిందే.సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ సమయంలో నరేష్ చేసిన వ్యాఖ్యలను ఇంకా పలు సందర్భాలలో నరేష్ వ్యవహరించిన తీరును ప్రకాష్ రాజ్ ప్యానల్ కి చెందిన శ్రీకాంత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎన్నికలలో శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి భారీ మెజార్టీతో గెలవడం తెలిసిందే.
అయితే మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచినా గాని అక్కడ ఎక్కువ నరేష్ హవా నడుస్తున్నట్లు.
దీంతో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.చాలా సామరస్య వాతావరణంలో వాళ్లు మా సభ్యులకు మంచి పనులు చేయాలంటే.కచ్చితంగా రాజీనామా చేయటం ఒకటే సరైన మార్గమని కొనసాగితే గొడవలు అవటం గ్యారెంటీ అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.నరేష్ ఉండటం వల్ల గొడవలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ విషయం విష్ణుతో కూడా చర్చించడం జరిగిందని, ఇంకా ఈ రీతిలో కొనసాగితే.
మా సభ్యులకు ఎవరు న్యాయం చేయలేరు అని అందువల్లే రాజీనామా చేస్తున్నట్లు మంచు విష్ణు తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ.శ్రీకాంత్ తాజా మీడియా సమావేశంలో వివరణ ఇవ్వటం జరిగింది.