టాలీవుడ్ లో మొన్నటి వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సృష్టించిన రచ్చ అంతా ఇంత కాదు.ఈ ఎన్నికల కోసం గత నెల రోజులుగా మా సభ్యులు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ ఎన్నికలపై హీట్ పెంచేశారు.
ఎప్పుడు లేనంత హడావిడిగా రసవత్తరంగా ఎన్నికలు జరగడంతో అందరిలో ఒక రకమైన ఉత్కంఠ మొదలయ్యింది.మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మా అధ్యక్షా పదవికి పోటీ పడగా చివరికి విజయం విష్ణుకి వరించింది.
అయితే ఈ ఎన్నికలు ముగిసే వరకు అటు ప్రకాష్ రాజ్ అభ్యర్థులు.ఇటు మంచు విష్ణు అభ్యర్థులు రచ్చ రచ్చ చేసారు.తెలుగు కీర్తిని బయటకు లాగారు.అయితే ఇన్ని జరుగుతున్నా కూడా టాలీవుడ్ సినీ పెద్దలు మౌనం వహించారు.
ఎవరికీ వారు ప్రెస్ మీట్లు పెట్టి మరి దూషించు కుంటున్న చూస్తూ ఊరుకున్నారు.అయితే అంత రచ్చ జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు ఈ విషయంపై స్పందిస్తున్నారు.
మొన్న ఎన్నికలు ముగిసి విష్ణు గెలుపొందాడు అని తెలియగానే చిరంజీవి నోరు విప్పారు.రెండు, మూడేళ్ళ ఉండే ఈ పోస్ట్ కోసం ఒకరిపై ఒకరు మాటలు అనుకుంటూ.‘మా’ పరువు తీయడం ఎంత వరకు కరెక్ట్.ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండని.
చిన్న చిన్న పదవుల ఇగోలకు పోకుండా వివాదాలు కలిగించే వ్యక్తులను దూరంగా ఉంచాలంటూ చిరు మా సభ్యులను కోరారు.
ఆ తర్వాత మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.ఇకపై ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం అయితే బాగుంటుందని ముందు ముందు ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే బాగుటుందని చెప్పుకొచ్చారు.ఆ తర్వాత విష్ణు కూడా స్పందించారు.
వివాదం ఇంత దూరం రాకుండా ఉండకూడదని.తామంతా ఒకే కుటుంబం అని చెప్పారు.
ఇక ముందు ఇలా గొడవలు జరగ కూడదని ఇండైరెక్ట్ గా ఏకగ్రీవం నే కోరుకుంటున్నట్టు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇక తాజాగా టాలీవుడ్ సినీ పెద్ద దర్శకేంద్రుడు రాజమౌళి కూడా స్పందించారు.ఇంత అలజడి మన సినీ పరిశ్రమకు మంచిది కాదని.సినీ పెద్దలంతా మా అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుని ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు.
అయితే ఈ విషయాలు ఎన్నికలప్పుడు రచ్చ రచ్చ చేస్తుంటే నోరు ఎందుకు మెదపలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు.సినీ పెద్దలంతా చొరవ తీసుకుని ఉంటే ఈ ఎన్నికలు ఇంత రచ్చ అయ్యేవి కాదంటూ అభిప్రాయ పడుతున్నారు.