ఇటీవల నటుడు పోసాని కృష్ణమురళి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఎంతటి పరిణామాన్ని సృష్టించాయి అందరికీ తెలిసిందే.రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పోసాని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి తెలియజేయడంతో పవన్ అభిమానులు పోసాని పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం ఈ క్రమంలోనే ఈ విషయం పై నాగబాబు ఘాటుగా స్పందించారు.
ఆ వ్యక్తి పేరు మాట్లాడి నా నోటిని పాడు చేసుకోదలచు కోలేదని నాగబాబు అన్నారు.
ఇక పోసాని చేసిన వ్యాఖ్యలపై కూడా తాను స్పందించ లేదని ఆయన అన్నారు.
అది ఒక పొలిటికల్ లెవెల్ లో వార్ జరిగింది.ఆ సమయంలో తన బదులు అప్పటికే జనసేన నాయకులే సమాధానం ఇచ్చారని అంతే కాకుండా సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ లో ఉండడం వల్ల చాలా డిప్రెషన్ లో ఉన్నానని, అందుకే తాను అప్పుడు ఏమీ మాట్లాడలేదని నాగబాబు తెలిపారు.
ఈ సందర్భంలోనే నాగబాబు మాట్లాడుతూ ఇంకొకసారి మా తమ్ముడు పైకి వస్తే బాగుండదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా… పోసాని పేరు మాత్రం తన నోటి నుంచి ఎప్పుడూ రాదని ఆయన స్పష్టం చేశారు.
ఇకపోతే మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలోనూ నాగబాబు ప్రకాష్ రాజ్ ప్యానల్కు మద్దతు తెలుపుతూ మంచు విష్ణుపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.ఇలా ఈ ఎన్నికల గురించి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పెద్ద ఎత్తున పోటీ పడినప్పటికీ చివరికి ఈ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే.