అక్కినేని హీరో అఖిల్ హీరోగా ఇప్పటి వరకు అఖిల్. హలో మరియు మిస్టర్ మజ్ను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఆ మూడు సినిమా కూడా నిరాశ పర్చాయి.ఏ ఒక్కటి కూడా కమర్షియల్ గా నిరాశ పర్చలేదు.
ఏ హీరో అయినా కూడా ఒక్క సినిమా ప్లాప్ అయితే తన మార్కెట్ ను భారీగా కోల్పోతాడు.ఇప్పుడు అఖిల్ కూడా తన మార్కెట్ విషయంలో చాలా కోల్పోయాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
మొదటి సినిమాకు భారీగా ఖర్చు పెట్టి బాగానే మార్కెట్ చేశారు.రెండవ సినిమాకు పాతిక కోట్లను అమ్మడం జరిగింది.
మూడవ సినిమాను కూడా దాదాపుగా పాతిక కోట్లకు అమ్మేశారు.కాని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా కు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ అవ్వడంతో పాటు అఖిల్ అక్కినేని వరుసగా మూడు సినిమాలు ప్లాప్ అవ్వడం వల్ల మార్కెట్ చాలా తగ్గిందనే వాదన ట్రేడ్ వర్గాల వారు చేస్తున్నారు.
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాను కొన్ని ఏరియాల్లో బయర్లు కొనుగోలు చేసేందుకు మరీ తక్కువ మొత్తంను బిడ్ చేశారట.దాంతో ఆ ఏరియాల్లో సొంతంగానే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
గీతా ఆర్ట్స్ వారికి పంపిణీ సంస్థ కూడా ఉంది.కనుక వారు సొంతంగానే అక్కడ పంపిణీ చేయడం జరుగుతోంది.
కొన్ని ఏరియాల్లో మాత్రం అమ్ముడు పోయిందని.అది కూడా చాలా తక్కువ మొత్తంకే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి అక్కినేని బ్యాచిలర్ సినిమా మొత్తంగా పదిహేను కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసిందనే వాదన వినిపిస్తుంది. 16.5 కోట్ల రూపాయలను వసూళ్లు చేస్తే అఖిల్ బ్రేక్ ఈవెన్ సాధించినట్లుగా చెబుతున్నారు.ఇక 20 కోట్లు వసూళ్లు దక్కించుకుంటే మంచి కమర్షియల్ సక్సెస్ గా కూడా చెప్పుకోవచ్చు ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే నిర్మించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
కనుక పరిస్థితి ఎలా ఉంటుంది.వసూళ్లు ఎలా ఉండి నిర్మాతల కష్టం కు ప్రతిఫలం ఉంటుందా అనేది చూడాలి.