ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నటి పూనమ్ కౌర్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చేసే పోస్టుల గురించి కూడా సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.
నటుడు పోసాని, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పూనమ్ కౌర్ పేరును ప్రస్తావించడంతో పూనమ్ కౌర్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా పూనమ్ కౌర్ నాగార్జునతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ నాగార్జున గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన గగనం సినిమాలో పూనమ్ కౌర్ కీలక పాత్రలో నటించారనే సంగతి తెలిసిందే.డిగ్నిటీ, దయ, గ్రేస్ ఉన్న నటులలో నాగార్జున సార్ ఒకరని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు.
నాగార్జునకు, నాగార్జున కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానని పూనమ్ కౌర్ కామెంట్లు చేశారు.అయితే పూనమ్ కౌర్ నాగార్జున గురించి ఎందుకు ట్వీట్ చేశారో నెటిజన్లకు అర్థం కావడం లేదు.
కొంతమంది మాత్రం పూనమ్ కౌర్ షేర్ చేసిన ఫోటోలలో ప్రకాష్ రాజ్ ఫోటో కూడా ఉండటంతో ప్రకాష్ రాజ్ కోసం పూనమ్ కౌర్ ఎలక్షన్ ప్రమోషన్ చేస్తున్నారని భావిస్తున్నారు.
ప్రకాష్ రాజ్ గెలిస్తే తను ఎదుర్కొన్న బాధలను సైతం బయటపెడతానని పూనమ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.పూనమ్ చెప్పే విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పీకే లవ్స్ అంటూ తాజాగా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.పోసాని కామెంట్ల గురించి స్పందించని పూనమ్ కౌర్ సోషల్ మీడియా పోస్టుల ద్వారా మాత్రం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుండటం గమనార్హం.మరోవైపు గత రెండేళ్లుగా పూనమ్ కౌర్ కు పెద్దగా ఆఫర్లు రావడం లేదు.