1.యూఏఈ లోని భారత ప్రవాసులకు కీలక సూచన
యూఏఈ లోని భారత ప్రవాసులకు దుబాయిలోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక సూచనలు చేసింది.పాస్పోర్టు గడువు ముగియడానికి ముందే రెన్యువల్ చేసుకోవాలని సూచించింది.
2.60 ఏళ్లు దాటిన వలసదారులకు కువైట్ శుభవార్త
గల్ఫ్ దేశం కువైట్ లో ఉపాధి పొందుతున్న అరవై ఏళ్ళకు పైబడిన వలసదారులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.యూనివర్సిటీ డిగ్రీ లేని 60 ఏళ్లు దాటిన వలసదారులకు వర్క్ పర్మిట్ లను నిలిపివేయాలని 14 నెలల క్రితం పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ గతంలో నిర్ణయించింది.అయితే తాజాగా ఆ నిర్ణయాన్ని ఆదేశం మంత్రి మండలికి చెందిన ఫత్వా , లెజిస్లేషన్ విభాగం రద్దు చేసింది.
3.గ్రీన్ లిస్ట్ దేశాల జాబితాలో భారత్ కు దక్కని చోటు
యూఏఈ రాజధాని అబుదాబి మరోసారి గ్రీన్ లిస్ట్ దేశాల జాబితా సవరించింది.మరికొన్ని దేశాలను ఈ జాబితాలోకి చేర్చింది.కానీ భారత్ కు ఆ జాబితాలో చోటు దక్కలేదు.
4.వెనక్కి తగ్గిన బ్రిటన్ భారత్ కు ఊరట
భారత్ దెబ్బకు బ్రిటన్ దిగివచ్చింది.అక్టోబర్ 11 నుంచి ఒక విషయం లేదా యూకే ప్రభుత్వం ఆమోదించిన ఇతర పేక వేసుకుని ఆ దేశానికి వెళ్లే భారత ప్రయాణికులు ఈ టైం లో ఉండాల్సిన అవసరం లేదని బ్రిటిష్ హై కమిషన్ వెల్లడించింది.
5.పాక్ లో భూకంపం
పాకిస్తాన్ లోని బలుచిస్తాన్ ప్రావీన్స్ లో భూకంపం సంభవించింది.ఈ దుర్ఘటనలో 22 మంది మృతి చెందారు.
6.ఆఫ్ఘనిస్తాన్ లో భారీ పేలుడు
ఆఫ్ఘనిస్తాన్ లో బాంబు పేలుడు జరిగింది నగరంలోని మసీదులు జరిగిన అనేక మంది గాయపడ్డారు.ఈ పేలుడు లో అనేక మంది ప్రాణాలు విడిచారు.
7.మలేరియా వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం
ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ ( ఆర్జీఎస్ , ఎస్ / ఏ ఎస్ 01 ) కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలిపింది.
8.మార్స్ పై నదీ పరివాహక ప్రాంతాలను గుర్తించిన నాసా రోవర్
వందల కోట్ల ఏళ్ల క్రితం మార్స్ గ్రహం పై నదులు ప్రవహించాయి ఆ ప్రవాహం వల్ల ఇప్పుడు ఆ గ్రహం ఇలా కనిపిస్తోంది అని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.నాసాకు చెందిన పర్సీ వరెన్స్ రోవర్ తీసిన రోవర్ తీసిన చిత్రాలు మార్స్ గ్రహం పై నదుల పరీవాహక ప్రాంతాల ను చూపించినట్టు శాస్త్రవేత్తలు చెప్పారు.
9.చైనా సముద్రంలో అమెరికా న్యూ క్లియర్ సబ్ మెరైన్ కు ప్రమాదం
దక్షిణ చైనా సముద్రంలో అలజడి రేగింది.అమెరికా న్యూక్లియర్ సబ్ మెరైన్ ప్రమాదానికి గురైంది.గత కొన్ని ఏళ్లుగా వివాదం నెలకొన్న అంతర్జాతీయ సముద్రజలాల ప్రాంతం లోకి వెళ్ళిన జలాంతర్గామి అనుకోకుండా ఓ వస్తువు ఢీకొట్టింది.దీంతో సబ్ మెరైన్ లోని నేవీ సిబ్బంది గాయాలపాలయ్యారు.
10.ఆఫ్ఘన్ లో మీడియా పై ఆంక్షలు
ఆఫ్ఘనిస్థాన్లో జర్నలిస్టుల పరిస్థితి దుర్భరంగా మారింది.తాలిబన్లు మీడియాపై ఆంక్షలు తీవ్రతరం చేయడంతో ఇప్పటికే అనేక సంస్థలు మూతపడ్డాయి కొంతమంది జర్నలిస్టులు దేశాన్ని విడిచి వెళ్లిపోయారు.దీంతో దీనినే ఉపాధిగా మార్చుకున్న జర్నలిస్టుల పరిస్థితి అయోమయంగా మారింది.