బుల్లితెర డ్యాన్స్ రియాలిటీ షోలలో ఢీ షో ఒకటనే సంగతి తెలిసిందే.ఈ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న కంటెస్టెంట్లలో నైనిక, సాయి ఉన్నారు.
తాజాగా ప్రసారమైన ఢీ షో ప్రోమోలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలోని నిలువద్దము నినుఎపుడైనా పాటకు సాయి స్టెప్పులు వేశారు.నైనిక సాయికి లవ్ షేప్ లో ఉన్న బెలూన్ ఇవ్వగా యాంకర్ ప్రదీప్ నైనికను సాయిగారు ఎలా పర్ఫామ్ చేశారని అడుగుతారు. నైనిక ఆ ప్రశ్నకు బదులిస్తూ సాయి బాగా చేశాడని చెబుతారు.ప్రియమణి మీరే జడ్జి అయితే సాయి పర్ఫామెన్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పాలని కోరగా ఈరోజు నేను నెర్వస్ గా ఉన్నానని వాడు బాగున్నాడని నైనిక సమాధానం ఇస్తుంది.
సాయి నైనికతో ప్రపంచంలో నిన్ను చాలామంది లవ్ చేస్తారని అందులో నేనొకడినని ఒక్కడే నిన్ను లవ్ చేస్తే ఆ ఒక్కడిని నేనని చెబుతాడు.
నిన్ను ఎవరూ లవ్ చేయకపోతే మాత్రం ప్రపంచంలో నేను లేనంటూ తన ప్రేమను సాయి వెల్లడిస్తాడు.
ఆ తర్వాత నైనిక, సాయి అదిరిపోయేలా ఫోజు ఇస్తారు.ఆ తర్వాత పూర్ణ సాయి.
నువ్వు నిజంగానే నైనికను లవ్ చేస్తున్నావా? అని అడగగా సాయి బాగుంటుంది మామ్ అని సమాధానం ఇస్తాడు.ఆ తర్వాత ప్రియమణి యస్ లేదా నో ఏదో ఒకటి చెప్పాలని కోరగా సాయి వెంటనే యస్ అని చెబుతాడు.
సాయి అలా చెప్పడంతో నైనిక వెంటనే సిగ్గు పడతారు.ఆ తర్వాత సాయి మా అత్తగారు కూడా ఇక్కడే ఉన్నారంటూ నైనిక తల్లిని చూపిస్తారు.నైనిక తల్లి కూడా సాయి నైనికల ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం గమనార్హం.ఈ ప్రోమోకు 25 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.