ఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ చింతా మోహన్ వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.
ఆర్థికమంత్రి అప్పుల శాఖ మంత్రి గా మారారని సెటైర్ వేశారు.ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వయ్యా స్వామి పని చేసిన వాళ్లకు జీతాలు ఇవ్వకపోతే ఎలా అంటూ ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా జీతాలు అదే రీతిలో ఉన్న ఉద్యోగస్తులకు పెన్షన్లు.సమయానికి ప్రభుత్వం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చింతామోహన్.ఏపీ మూడు రాజధానులు విషయం గురించి కూడా స్పందించారు.చెప్పుకోవడానికి ఎన్ని రాజధానులైన చెప్పుకోవచ్చు ఎక్కడపడితే అక్కడ అన్నట్టు మాట్లాడుతున్నారు.కర్నూలులో హైకోర్టు అంటున్నారు.
అది ఏమైనా హైస్కూలా అని విమర్శించారు.హైకోర్టు ఎక్కడ ఏర్పడాలి అనేది నిర్ణయించేది జడ్జీలు అని.ప్రజా ప్రతినిధులు కాదని చెప్పుకొచ్చారు.3 రాజధానుల నిర్ణయం అనేది ఆచరణ కాదని ఇది అసాధ్యం అంటూ చింతామోహన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.